Breaking News

నిర్భయదోషులు మరణించారు.. డాక్టర్ల ధృవీకరణ


నిర్భయ హత్యాచార ఘటనలో నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు అయ్యింది. దోషుల ఉరి అనంతరం వైద్యులు పరిశీలించారు. నలుగురు మృతిచెందారని ధృవీకరించారు. శుక్రవారం ఉదయం 5:30లకు నిర్భయ దోషులైన ముఖేశ్‌ సింగ్‌(32), వినయ్‌ శర్మ(26), అక్షయ్‌ ఠాకూర్‌ సింగ్‌(31), పవన్‌ గుప్తా(25) లకు ఉరివేశారు. ఆ తర్వాత 30 నిమిషాల పాటు ఉరికంబాలపైనే ఉంచారు. అనంతరం నలుగురు దోషులను కిందకు దించి వారిని వైద్యులు పరీక్షించి నలుగురూ మరణించారని ధృవీకరించారు. నలుగురు మృతదేహాలను కూడా పోస్టుమార్టం నిర్వహిస్తారు. అనంతరం మృతదేహాలకు కుటుంబసభ్యులకు అప్పగించడమో లేక... జైల్లోనే ఖననం చేయడమో చేస్తారు. ఉదయం నాలుగు గంటలకే నలుగురికి అల్పహారం అందించారు జైలు అధికారులు. అయితే రాత్రి ఎవరూ సరిగా నిద్రపోలేదని తీహార్ జైలు అధికారులు చెబుతున్నారు. ఉరిశిక్ష అమలు చేస్తారన్న భయం, ఆవేదన వారిలో కనిపించాయని చెబుతున్నారు. ముఖేష్ సింగ్, వినయ్ శర్మ గురువారం రాత్రి భోజనం చేశారు. పవన్ గుప్తా మాత్రం భోజనం చేయడానికి నిరాకరించాడు. జైలు నిబంధనల ప్రకారం తెల్లవారుజామున నలుగురికి వైద్య పరీక్షలు నిర్వహించారు.. వారి చివరి కోరిక గురించి అడగ్గా.. నలుగురు మౌనం వహించారు.. అనంతరం వేకువజామున 5.30గంటలకు ఉరి శిక్ష అమలు చేశారు. జైలు నెంబర్ 3లో నలుగురు నిందితులకు ఉరిశిక్ష అమలు చేశారు. నలుగురిని ఒకే సమయంలో ఉరి తీశారు. ఒక్కొక్క దోషి 12 మంది సిబ్బంది ఉన్నారు. ఉరికంబం వద్ద 48 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. ఉరిశిక్షకు ముందు వినయ్ శర్మ బోరున విలపించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు నిర్భయ దోషులకు ఉరి తీయడంతో తీహర్ జైలు బయట సంబరాలు చేసుకున్నారు.


By March 20, 2020 at 06:46AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/4-convicts-declared-dead-by-doctor-30-minutes-after-hanging/articleshow/74721761.cms

No comments