Breaking News

కరోనా కట్టడిలో చైనా మరో మైలురాయి.. తొలిసారి స్థానికుల్లో జీరో కేసులు


మూడు నెలల తర్వాత తమ దేశంలో తొలిసారి కేసు నమోదుకాలేదని చైనా ప్రభుత్వం గురువారం వెల్లడించింది. దీంతో ప్రజా జీవనం, ఆర్ధిక వ్యవస్థపై పెను ప్రభావం చూపుతున్న కరోనా వైరస్‌ విషయంలో చైనా కీలక మైలురాయిని చేరుకుంది. కోవిడ్‌ తీవ్రతకు ఇటలీ, అమెరికా లాంటి దేశాలు ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకుని సతమతవుతుంటే, చైనా మాత్రం వైరస్‌ను సమర్ధంగా నిరోధించి, లక్ష్యాన్ని సాధనలో విజయం నమోదుచేసింది. ఒకవేళ, చైనా తప్పుడు గణాంకాలు వెల్లడిస్తే దాని పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. కోవిడ్ 19 విషయంలో మొదట వాస్తవాలను దాచిపెట్టి, అలసత్వం ప్రదర్శించడంతో వైరస్ విజృంభించింది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ప్రభుత్వం మేల్కొని, చర్యలకు ఉపక్రమించింది. మిలియన్ల మందిని ఇళ్లకు పరిమితం చేసి, ప్రజా రవాణాను నిలిపివేసి, హుబే ప్రావిన్సులను నిర్బంధంలో ఉంచింది. అంటువ్యాధిని త్వరగా తగ్గించడానికి అత్యంత కఠినంగా వ్యవహరించినా, ఆర్థిక నష్టం తీవ్రంగా ఉంది. అయితే, కరోనా వైరస్ నుంచి చైనాకు పూర్తిగా ముప్పు తొలగిపోలేదు. పాలక కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో దేశం యావత్తు గమనించింది. ప్రస్తుతం చైనా వెల్లడించిన గణాంకాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం 34 కరోనా వైరస్ కేసులు నమోదైనా, వీరంతా విదేశాల నుంచి వచ్చినవారేనని అధికారులు గురువారం ప్రకటించారు. చైనా కాదు, ఏ దేశానికైనా వైరస్‌ను పూర్తిగా నిరోధించడం సాధ్యం కాదు. చైనాలో అనేక ప్రావిన్సులు, నగరాలలో ప్రయాణాలు నిలిపివేశారు. ప్రయాణాలపై నిషేధం ఎత్తివేసిన తర్వాత వైరస్ మళ్లీ వ్యాపిస్తుందా అనే ప్రశ్న ఉత్పనమవుతుంది. చైనాలో తీసుకున్న చర్యలు కోవిడ్‌ను దాదాపు నిరోధించాయని స్పష్టమవుతోందని హాంకాంగ్ విశ్వవిద్యాలయంస్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌లో ఎపిడెమియాలజీ, బయోస్టాటిస్టిక్స్ విభాగం అధిపతి బెన్ కౌలింగ్ వ్యాఖ్యానించారు. అయితే, చైనా చేపట్టిన చర్యలు దీర్ఘకాలికంగా స్థిరంగా ఉండవని, రెండో దశలో ఏం జరుగుతుందనేది ప్రశ్నార్దకమేనని అన్నారు. కోవిడ్‌పై పోరాటాన్ని ప్రజల యుద్ధంగా చైనా అధ్యక్షుడు జీజిన్‌పింగ్ పిలుపునిచ్చారు. పార్టీ యొక్క ప్రచార సంస్థలు ఇటీవలి వారాల్లో పార్టీ ప్రతిస్పందనను విజయవంతం చేశాయని, ఇతర దేశాలకు ఒక నమూనాగా నిలిచాయని ప్రశంసించారు. ఇటీవలి రోజుల్లో వైరస్ భయం, బలమైన చర్యలు తీసుకోడానికి ప్రజల నుంచి ఒత్తిడి, పౌరులపై కఠినమైన ఆంక్షలు విధించడానికి ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ లాంటి ప్రజాస్వామ్య ప్రభుత్వాలను వెనుకాడాయి. ఇటువంటి విధానాల దీర్ఘకాలిక ప్రభావాలు ముఖ్యంగా వుహాన్, హుబీ ప్రావిన్స్‌లలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ జనవరి చివరి వారం నుంచి 50 మిలియన్లకు పైగా ప్రజలు తీవ్రమైన నియంత్రణకు గురయ్యారు. వారాలుగా ఆసుపత్రులలో గడిపారు. వైద్య సిబ్బందికి ప్రాథమిక రక్షణ సామగ్రి లేకపోవడం..ఆహార కొరతపై ప్రజలు నిరసన తెలిపారు. తీవ్ర అనారోగ్యంతొ ఉన్నవారు సకాలంలో సంరక్షణ దొరక్క... చాలామంది మరణించారు.


By March 19, 2020 at 09:56AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/china-reports-no-new-local-cases-hits-a-coronavirus-milestone/articleshow/74703878.cms

No comments