Breaking News

కాకినాడలో కామాంధుడు.. 8ఏళ్ల బాలికపై ఆటోడ్రైవర్ అత్యాచారం


ఆంధ్రప్రదేశ్‌లో దిశ చట్టం అమల్లోకి వచ్చినా మహిళలు, చిన్నారులపై నేరాలకు మాత్రం అడ్డుకట్ట ఏర్పడటం లేదు. నిత్యం ఎక్కడో చోట అత్యాచారాలు, అఘాయిత్యాలు, దాడులు జరుగుతున్న ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా జిల్లా కేంద్రమైన కాకినాడలో సోమవారం రాత్రి 8ఏళ్ల బాలికపై ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. Also Read: నగరంలోని ఇంద్రపాలెంలో నివసించే దంపతులకు కుమార్తె(8) ఉంది. సోమవారం రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై ఎదురింట్లో ఉండే ఆటోడ్రైవర్ అచ్చిరాజు(32) బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. కాసేపటి తర్వాత ఇంటికొచ్చిన తల్లి బాలిక రక్తస్రావంతో బాధపడటాన్ని గమనించి ఆరా తీసింది. తనపై అచ్చిరాజు అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలు చెప్పడంతో ఆమె ఇంద్రపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దిశ పోలీస్‌స్టేషన్‌కు కేసును బదిలీ చేశారు. Also Read: ఈ ఘటన కాకినాడలో కలకలం రేపడంతో కాకినాడ రూరల్‌ సర్కిల్‌ పోలీసులతో పాటు, కాకినాడ డీఎస్పీ, సీఐలు, దిశ పోలీసులు ఇంద్రపాలెం పోలీస్‌స్టేషన్‌లో నిందితుడిని విచారించారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలిక బంధువులు పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆందోళన చేపట్టారు. నిందితుడిని తమకు అప్పగించాలంటూ వారు డిమాండ్ చేయడంతో ఇంద్రపాలెం పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. Also Read:


By March 17, 2020 at 10:30AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/8-yr-old-girl-raped-by-auto-driver-in-kakinada/articleshow/74667027.cms

No comments