Breaking News

197 దేశాలకు పాకిన కరోనా వైరస్.. 20వేలకు చేరువలో మరణాలు


చైనాలో పుట్టి ప్రపంచాన్నే వణికిస్తున్న ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు ఇది వ్యాపించింది. 195 దేశాలతో, రెండు అనధికార దేశాలు కలిపి మొత్తం 197 దేశాల్లో కరోనా వ్యాపించింది. ఇప్పటివరకు అన్ని దేశాల్లో కలిపి 422,614 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... వీరిలో 1,08,323 మంది ఆ మహమ్మారి నుంచి బయటపడ్డారు. దీని బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 18,892కి చేరింది. Also Read: ప్రస్తుతం కరోనా పాజిటివ్‌గా ఉన్న 2,91,341 మందిలో 2,78,360 మంది కోలుకునే అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. మిగిలిన వారి పరిస్థితి మాత్రం ఆందోళనకరంగా ఉన్నట్లు వెల్లడించారు. మొదట ఈ వైరస్ వ్యాపించిన దేశాలు నెమ్మదిగా కోలుకుంటుంటే... తర్వాత వ్యాపించిన దేశాలు మాత్రం వణుకుతున్నాయి . భారత్‌లో ఈ వైరస్ ప్రస్తుతం రెండో దశలో ఉంది. ఇది మరింత వ్యాప్తి చెందితే లక్షల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయన్న నిపుణుల ఆందోళనతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినచర్యలు తీసుకుంటున్నాయి. అనేక రాష్ట్రాలు మార్చి 31వరకు లాక్‌డౌన్ ప్రకటించగా.. మంగళవారం జాతినుద్దేశించి ప్రసంగిస్తూ దేశ మొత్తం 21రోజుల పాటు లాక్‌డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారు. భారత్‌లో ఇప్పటివరకు 569 మందికి ఈ వైరస్ సోకగా 11 మంది ప్రాణాలు కోల్పోయారు. Also Read: కరోనా వైరస్‌కు పుట్టినిల్లయిన చైనాలో 81,171 కేసులు నమోదు కాగా... 3,277 మంది చనిపోయారు. అక్కడ కొద్దిరోజులుగా కొత్త కేసులు, మరణాలు నమోదు కాకపోవడం ఊరటనిచ్చే అంశం. ఇటలీలో 69,176 మందికి ఈ వైరస్ సోకగా.. మరణాల సంఖ్య 6,820కి చేరింది. తొలినాళ్లలో ఇటలీ పాలకులు, ప్రజలు ప్రదర్శించిన నిర్లక్ష్యం వల్ల ఆ దేశం భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే అక్కడ రోజుకు వందల సంఖ్యలో కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. అమెరికాలో కొత్తగా నమోదైన 9,471 కేసులు కలుపుకొని రోగుల సంఖ్య 53,665కి చేరింది. మంగళవారం ఒక్కరోజే 134 మంది చనిపోవడంతో మరణాల సంఖ్య 698కి చేరింది. Also Read:


By March 25, 2020 at 08:34AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/confirmed-cases-of-covid-19-have-spanned-the-globe/articleshow/74802775.cms

No comments