Breaking News

దేశంలో 137కి చేరిన కరోనా కేసులు.. హైదరాబాద్‌లో చనిపోయిన వ్యక్తికి చికిత్స చేసిన డాక్టర్‌కు వైరస్


భారత్‌లో క్రమంగా వ్యాప్తిచెందుతోంది. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య 137కు చేరుకోగా.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. ఇక్కడ రోజురోజుకూ బాధితుల సంఖ్య పెరుగుతుండగా.. బాధితుల సంఖ్య 41కి చేరింది. మంగళవారం మరో ఇద్దరికి కరోనా వైరస్ నిర్ధారణ అయ్యింది. ఆ ఇద్దరూ అమెరికా నుంచి ఇటీవలే భారత్‌కు వచ్చినట్టు అధికారులు తెలిపారు. దేశంలో మంగళవారం మూడో కరోనా మరణం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. Read Also: ముంబైకి చెందిన ఆయన కొద్దిరోజుల కిందట దుబాయ్‌ నుంచి రాగా.. ఉన్నట్టు తేలింది. బాధితుడు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. అయితే, ఆయన కేవలం కరోనా వైరస్‌తోచే చనిపోలేదని, బీపీ, న్యూమోనియా కూడా ఉన్నట్టు బృహన్ ముంబై కార్పొరేషన్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ పర్దేశి వెల్లడించారు. ఆయన భార్యకు కూడా వైరస్ ఉన్నట్టు నిర్ధారణ కావడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని, ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. Read Also: మహారాష్ట్రకు చెందిన మూడేళ్ల చిన్నారి సైతం వైరస్ బారినపడింది. తొలుత ఆ పాప తండ్రికి వైరస్‌ నిర్ధారణ కాగా.. తర్వాత అతడి నుంచి భార్యకు, చిన్నారికి వైరస్‌ సోకింది. దేశంలో ఇప్పటివరకూ ఈ వైరస్‌ బారినపడిన 137 మందిలో 24 మంది విదేశీయులు ఉన్నారు. హర్యానాలో 15 మందికి వైరస్‌ నిర్ధారణ కాగా.. వారిలో 14 మంది విదేశీయులే. తొలిసారి ఆ రాష్ట్రానికి చెందిన ఓ మహిళకు వైరస్‌ సోకినట్టు మంగళవారం నిర్ధారణ అయ్యింది. ఆమె కూడా ఇటీవలే ఇండోనేషియా, మలేషియా వెళ్లొచ్చినట్టు అధికారులు వివరించారు. Read Also: కరోనా బాధితుల్లో ఇప్పటి వరకు 14 కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు. తాజాగా, పశ్చిమ్ బెంగాల్, పుదుచ్చేరిలోనూ తొలి కేసులు నమోదయ్యాయి. పుదుచ్చేరి మహిళ మార్చి 13న సౌదీ నుంచి భారత్‌కు వచ్చారని అధికారులు తెలిపారు. అలాగే, హైదరాబాద్‌లో మృతిచెందిన వ్యక్తికి తొలుత చికిత్స చేసిన కర్ణాటక వైద్యుడికి (63) కరోనా పాజిటివ్‌ వచ్చింది. బ్రిటన్ నుంచి 20 ఏళ్ల మహిళ, అమెరికా నుంచి వచ్చిన 67 ఏళ్ల వృద్ధురాలికీ వైరస్‌ సోకడంతో కర్ణాటకలో బాధితుల సంఖ్య 11కు చేరింది. ఇటలీ నుంచి స్వదేశానికి చేరుకున్న వీరు ప్రస్తుతం ఢిల్లీ సమీపంలోని ఐటీబీపీ క్వారంటైన్‌ శిబిరంలో ఉన్నారు.


By March 18, 2020 at 08:01AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/137-positive-cases-of-coronavirus-reported-in-india-so-far/articleshow/74683167.cms

No comments