భూపాలపల్లి జిల్లాలో 11 నెలల బాలుడి కిడ్నాప్.. జనాభా లెక్కల కోసం వచ్చి

తెలంగాణలోని జయశంకర్ జిల్లాలో 11 నెలల బాలుడు కిడ్నాప్కు గురయ్యాడు. మహాముత్తారం మండలం సింగంపల్లిలో జనాభా లెక్కల కోసం వచ్చామని స్థానికులను నమ్మించి ఇద్దరు దుండగులు చిన్నారిని బైక్పై ఎత్తుకుని వెళ్లిపోయారు. బాలుడు కనిపించకపోవడంతో కంగారుపడిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. Also Read: ఆదివారం జనాభా లెక్కల కోసం వచ్చామని గ్రామంలో తిరిగిన ఇద్దరు వ్యక్తులు ఓ వృద్ధురాలి ఇంటికి వెళ్లారు. ఆమెను వివరాలు అడగ్గా ఇంట్లో కొడుకు కోడలు లేరని, తర్వాత రావాలని ఆమె చెప్పింది. ఆ సమయంతో ఆమె మనవడు హరీశ్(11) బుడిబుడి అడుగులు వేసుకుంటూ బయటకు వచ్చాడు. దీంతో ఓ వ్యక్తి వృద్ధురాలిని మాటల్లో పెట్టగా మరో వ్యక్తి బాలుడి అపహరించాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి బైక్పై స్పీడుగా వెళ్లిపోయారు. కాసేపటికి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు బాలుడు కనిపించకపోవడంతో కంగారు పడ్డారు. Also Read: ఇంటికి ఇద్దరు వ్యక్తులు జనాభా లెక్కల కోసం వచ్చారని వృద్ధురాలు చెప్పడంతో వారే కిడ్నాప్ చేసి ఉంటారని తల్లిదండ్రులు అనుమానించారు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి ఆచూకీ కోసం నాలుగు స్పెషల్ టీమ్లు ఏర్పాటుచేశారు. గ్రామంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల్లో బాలుడిని బైక్ తీసుకెళ్తున్న దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి. వాటి ఆధారంగా కిడ్నాపర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. Also Read:
By March 09, 2020 at 11:41AM
No comments