Breaking News

బస్సులో మహిళపై డ్రైవర్, కండక్టర్ అత్యాచారం


బస్సులో ప్రయాణిస్తున్న మహిళపై డ్రైవర్, కండక్టర్ అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన గుజరాత్‌లో కలకలంరేపింది. ఆమెకు మాయ మాటలు చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డారు. మధ్యప్రదేశ్‌లోని కుక్సీకి చెందిన మహిళ పోర్‌బందర్‌లో కూలీగా పనిచేస్తోంది.. పదిరోజుల క్రితం తన భర్తతో కలిసి సొంత ఊరికి వెళ్లింది. బుధవారం రాత్రి ఆమె ఒక్కరే తిరిగి ఒంటరిగా కుక్సీ నుంచి ప్రైవేట్ బస్సులో పోరుబందర్ బయల్దేరింది. ఛోటా ఉదయపూర్ సమీపానికి రాగానే రాత్రి 9 గంటల సమయంలో ప్రయాణికులు భోజనం చేసేందుకు బస్సును ఓ హోటల్ దగ్గర ఆపారు. ఈలోపు మహిళ తాను బస్సులో పడుకునేందుకు కాస్త స్థలం చూపించమని బస్సు డ్రైవర్, కండక్టర్‌లను అడగ్గా.. ఆమెకు మాయ మాటలు చెప్పి బస్సు పైకి తీసుకెళ్లారు.. అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. ఆమె వారిని ప్రతిఘటించి తప్పించుకునే ప్రయత్నం చేయగా.. బస్సుపై నుంచి కిందకు తోసేస్తామని బెదిరించారు. బస్సు కండక్టర్, డ్రైవర్ ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. గురువారం బాధిత మహిళ బస్సులో చేరుకుని.. తన మేనల్లుడికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది. వెంటనే అతడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. అనంతరం బస్సు డ్రైవర్, కండక్టర్లను అరెస్ట్ చేశారు. బాధిత మహిళ స్టేట్‌మెంట్ రికార్డ్ చేశామని.. కేసును దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు.


By February 22, 2020 at 12:16PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/gujarat-private-bus-driver-and-conductor-rapes-woman/articleshow/74253605.cms

No comments