Breaking News

భర్తను చంపేందుకు భోజనంలో సెనైడ్ కలిపి భార్య.. చివరి క్షణంలో


భర్తను చంపేందుకు ఓ మహిళ కొడుకుతో కలిసి ప్లాన్ చేసిన ఘటన జిల్లాలో వెలుగులోకి వచ్చింది. తాను తినే భోజనం భార్య సెనైడ్ కలిపిందని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. Also Read: పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం పొలసానిపల్లికి చెందిన గురునాథ్ అనే వ్యక్తి సోమవారం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. తన భార్య కొడుకుతో కలిసి తనను చంపేందుకు ప్రయత్నిస్తోందని, తాను తినే భోజనంలో సెనైడ్ కలిపిందని ఫిర్యాదు చేశాడు. ఆఖరి క్షణంలో వారి ప్లాన్ పసిగట్టడంతో తాను ప్రాణాలతో బయటపడ్డానని చెప్పాడు. Also Read: గురునాథ్ ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు అతడి భార్య రాణి, కొడుకుతో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. అసలు గురునాథ్‌ను ఎందుకు చంపాలనుకున్నారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులకు సెనైడ్ ఎక్కడి నుంచి వచ్చిందన్న కోణంలోనూ విచారిస్తున్నారు. Also Read:


By February 18, 2020 at 12:34PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/eluru-wife-murder-attempt-on-husband-in-west-godavari-district/articleshow/74186819.cms

No comments