Breaking News

ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ వల.. పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానంటూ బెదిరింపులు


ఇటీవల సోషల్‌మీడియా ద్వారా మహిళలపై వేధింపులు పెరిగిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్ శివారు ప్రాంతానికి చెందిన ఎంబీఏ విద్యార్థినికి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన యువకుడు ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానని వేధిస్తున్నాడు. అతడి తీరు శ్రుతిమించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. Also Read: మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌ మండల పరిధిలోని వెంకటాపూర్‌లోని ఓ కాలేజీలో బోడుప్పల్‌కు చెందిన యువతి(21) ఎంబీఏ చదువుతోంది. ఆమెకు ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఓ యువకుడు పరిచయమయ్యాడు. కొద్దిరోజులకే ప్రేమ.. పెళ్లి అంటూ వేధింపులకు దిగాడు. నిన్ను పెళ్లిచేసుకోకపోతే చనిపోతానంటూ బెదిరించాడు. ‘నువ్వు ఎన్ని చెప్పినా నిన్ను ప్రేమించేదిలేది.. పెళ్లి చేసుకునేది లేదు.. ఇప్పటి వరకు మన మధ్య ఉన్నది స్నేహం మాత్రమే’ అని ఆ యువతి గట్టిగా చెప్పింది. అయినా వినిపించుకోకుండా అతడు వేధిస్తుండటంతో ఆమె తల్లిదండ్రులకు విషయం చెప్పింది. Also Read: తమ కూతురి జోలికి రావొద్దని వారు ఆ యువకుడిని హెచ్చరించినా మార్పు రాలేదు. యువతి ఫొటోలు మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పెట్టడంతో పాటు ఆమె గురించి తప్పుగా పోస్టులు చేశాడు. రెండు వారాల క్రితం యువతి చదువుతున్న కాలేజీకి వెళ్లి బలవంతంగా సెల్‌ఫోన్ లాక్కుని తనను పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. భయపడిపోయిన బాధితురాలు మంగళవారం రాత్రి ఘట్‌కేసర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By February 20, 2020 at 10:24AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/ghatkesar-police-booked-case-against-man-over-he-harassed-mba-student/articleshow/74219763.cms

No comments