Breaking News

పది రోజుల్లో పెళ్లి.. మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య


బెంగళూరులో మంచి ఉద్యోగం. ఆర్థికంగా స్థిరపడటంతో కుటుంబసభ్యులు పెళ్లి సంబంధం నిశ్చయించారు. పది రోజుల్లో పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లు దగ్గరుండి చూసుకునేందుకు ఉద్యోగానికి సెలవు పెట్టి ఇంటికి వచ్చేశాడు. ఆదివారం ఇంటికి రంగులు వేసే విషయంలో పినతల్లితో తలెత్తిన వివాదంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. Also Read: జిల్లా పలమనేరు మండలం టి.వడ్డూరు గ్రామ మాజీ ఎంపీపీ వేమన్నకు ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు ఇద్దరు కుమారులు. వీరిలో మొదటి కుమారుడు 20 సంవత్సరాల కిందట అనారోగ్యంతో మృతిచెందాడు. కొడుకుపై బెంగతో అతని తల్లి చనిపోయింది. కొంతకాలం తర్వాత బంగారుపాళ్యం మండలం బోడిబండ్ల గ్రామానికి చెందిన కోకిలను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. Also Read: వేమన్న మొదటి భార్య రెండో కుమారుడు యోగేష్‌(29) బెంగళూరులో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి పెళ్లి చేయాలని తండ్రి నిశ్చయించాడు. ఇటీవల అతడికి వి.కోట మండలం తోటకనుమ గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. మరో పది రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉన్నందున యోగేష్ ఇంటికొచ్చి అన్ని పనులు చూసుకుంటున్నాడు. ఈ నెల 20వ తేదీన ఇంటికి రంగులు వేసే విషయంలో యోగేష్‌కు, పినతల్లికి మధ్య వాగ్వాదం జరిగింది. Also Read: ఆ సమయంలో పిన తల్లి యోగేష్‌ను తిట్టడంతో అదేరోజు ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతడి ఆచూకీ తెలియలేదు. ఇంట్లోని వారు ఫోన్‌ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. ఆదివారం పెంగుగుంట శివారు అటవీ ప్రాంతంలో యోగేష్‌ బైక్ ఉన్నట్లు సమాచారం అందడంతో కుటుంబసభ్యులు అక్కడికి వెళ్లి చూడగా యోగేష్ విగతజీవిగా కనిపించాడు. సంఘటనా స్థలంలో బీరు సీసాతో పాటు విషపు గుళికలు ఉండటంతో అతడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావించారు. సమాచారం అందుకున్న పోలీసులు యోగేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో పది రోజుల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో రోదనలు వినిపిస్తున్నాయి. Also Read:


By February 24, 2020 at 08:38AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-commits-suicide-10-days-before-of-marriage-in-chittor-district/articleshow/74276129.cms

No comments