Breaking News

‘‘హీరోలను పక్కనబెట్టి త్రిషతో సినిమా చేసా, ఆమెకు ఇలా చేస్తుంది అనుకోలేదు’’


నటీనటుల పని సినిమాల్లో నటించగానే సరిపోదు. సినిమా ప్రేక్షకులకు చేరాలంటే బాగా ప్రమోట్ చేయాలి. సినిమాను ప్రమోట్ చేయగలిగే సత్తా నటీనటులకు మాత్రమే ఉంది. దర్శకులు, నిర్మాతల వల్ల కాదు. హీరో, హీరోయిన్స్ తాము నటించే సినిమాలను ఎంత ప్రమోట్ చేస్తే అంత రెస్పాన్స్ వస్తుంది. అయితే ఇప్పటికే ఇండస్ట్రీలోని కొందరు సెలబ్రిటీలు ప్రమోషన్స్‌కి దూరంగా ఉంటున్నారు. వారిలో లేడీ సూపర్‌స్టార్ నయనతార ఒకరు. ఆమె సినిమాలు చేయడం వరకే తన పని అని ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పింది. ప్రమోషన్స్‌కి ఇంటర్వ్యూలకు వెళ్లదు. మీడియా వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబితే వాటిని వక్రీకరించి రాస్తుంటారని అందుకే మీడియాకు దూరంగా ఉంటానని తెలిపారు. ఈ సంగతి పక్కనబెడితే.. ఇప్పుడు నటి కూడా ప్రమోషన్స్‌కి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. త్రిష ‘పరమపాదం విలైయాట్టు’ అనే తమిళ సినిమాలో నటించారు. ఇందులో త్రిష డాక్టర్‌గా ప్రధాన పాత్రలో నటించారు. ఇది హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా. ఈరోజు చెన్నైలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటుచేసారు. ఈవెంట్‌కు త్రిష రాలేదు. దాంతో సినిమా నిర్మాత టి. శివకు కాలింది. ఆయన స్టేజ్‌ మీద త్రిషకు వార్నింగ్ ఇచ్చారు. READ ALSO: ‘‘దర్శకుడు తిరుగ్నానంని మెచ్చుకోవాలి. హీరో లేకుండా చక్కటి కథను కేవలం హీరోయిన్‌తోనే చక్కగా తీసేసారు. ఆయనకు సినిమా పట్ల అంత కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే అనుకున్నట్లుగానే సినిమా తీసారు. ఈ సినిమాల్లో హీరోలే లేరు. అలాంటప్పుడు హీరోయిన్ కనీసం ప్రమోషన్స్ కోసం అయినా రావాలి కదా. ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందని తెలిసీ త్రిష రాలేదు. కనీసం ముందు ముందు జరిగే ప్రమోషన్స్‌లో అయినా పాల్గొనాల్సిందే. ఒకవేళ సినిమాను ప్రమోట్ చేయకపోతే సినిమా కోసం ఆమె తీసుకున్న రెమ్యునరేషన్‌లో సగం తిరిగి ఇచ్చేయాలి. అప్పుడే ప్రమోషన్స్‌కి రాకుండా ఎగ్గొట్టే నటీనటులకు ఓ గుణపాఠం అవతుంది’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 28న రిలీజ్ కానుంది. READ ALSO:


By February 22, 2020 at 02:05PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/trisha-starrer-paramapatham-vilaiyattu-producer-warns-the-actress-for-not-promoting-the-film/articleshow/74254791.cms

No comments