Breaking News

ఆడుకుంటుండగా ఎగసిన అగ్నికీలలు.. నలుగురు చిన్నారుల సజీవ దహనం


ఒడిశాలోని జిల్లాలో ఆదివారం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో నలుగురు చిన్నారులు సజీవదహనమయ్యారు. పొలసరా సమితిలో మాళొతెంతులియా పంచాయతీలోని చిన్న గ్రామం ఖొయిరఛొటిలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న విషయమై అటు బాధిత కుటుంబీకులు, గ్రామస్థులు, ఇటు పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు ఏమీ చెప్పలేకపోతున్నారు. Also Read: ఖొయిరఛొటి గ్రామంలోని గౌడ సమాజ భవనం సమీపాన శివ మందిరం వెనుకవైపు కొద్దిరోజులుగా మరుగుదొడ్ల నిర్మాణం జరుగుతోంది. గ్రామానికి చెందిన కొందరు చిన్నారులు వెదుర్లతో మంచెగా కట్టి, పైన, కింద ఎండు గడ్డిని అమర్చి రోజూ ఆడుకుంటున్నారు. ఆదివారం ఉదయం ట్యూషన్ల నుంచి తిరిగి వచ్చిన నలుగురు చిన్నారులు రోజూ మాదిరిగానే మంచెలో ఆడుకుంటున్నారు. అయితే వారున్న చోట గడ్డికి హఠాత్తుగా నిప్పంటుకుని అగ్నికీలలు వ్యాపించాయి. బాలుర కేకలు విని వచ్చి స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని రక్షించి పొలసరా ప్రభుత్వానికి తరలించారు. Also Read: ప్రమాదంలో గాయపడ్డ నలుగురు చిన్నారుల్లో సాయిరాం జాని (4), దీపక్‌ గౌడ (8) మార్గమధ్యంలోనే మృతిచెందగా, ఇతిశ్రీ జెనా (7) అనే బాలిక చికిత్స పొందుతూ చనిపోయింది. అలోక్‌ జెనా(5) అనే బాలుడిని మెరుగైన చికిత్స కోసం కటక్‌ ఎస్సీబీసీకి తరలించగా చికిత్స పొందతూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇతిశ్రీ, అలోక్‌ అన్నదమ్ముల బిడ్డలు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పొలసరా ఎమ్మెల్యే శ్రీకాంత్‌ సాహు ఆరోగ్య కేంద్రానికి చేరుకుని బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాదం అలముకుంది. Also Read:


By February 24, 2020 at 10:27AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/fire-accident-in-odisha-4-children-killed/articleshow/74277334.cms

No comments