Breaking News

విలేకరితో అఫైర్, విడాకులివ్వాలంటూ భర్తకు బెదిరింపులు.. గుంటూరులో కిలేడీ


పది రోజుల్లో విడాకులు ఇవ్వకపోతే భార్య చంపేస్తానని బెదిరిస్తోదంటూ ఓ అమాయక భర్త పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన రూరల్ ఎస్పీ కార్యాలయంలో చోటుచేసుకుంది. పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య తనను తీవ్రంగా వేధిస్తోందని, ఆమె నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. Also Read: వివరాల్లోకి వెళ్తే.. నరసరావుపేట మండలంలో వడ్రంగి పనిచేస్తూ జీవించే వ్యక్తికి 16ఏళ్ల క్రితం అదే ప్రాంతానికి చెందిన మహిళతో వివాహమైంది. ఇద్దరికీ అది రెండో వివాహమే. ఆ దంపతులకు ఇద్దరు సంతానం. ఆస్తి తగాదాల్లో భాగంగా వారింటిని బంధువులు కూల్చివేయడంతో కొన్నాళ్ల క్రితం నరసరావుపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అక్కడ విలేకరిగా పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి అతడి భార్యను బుట్టలో వేసుకుని అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. Also Read: ఆమె ప్రవర్తనలో మార్పు రావడంతో అనుమానం వచ్చి భర్త స్థానికులను ఆరా తీయగా అతడు ఇంట్లో లేని సమయంలో ఓ వ్యక్తి వచ్చి వెళ్తున్నట్లు చెప్పారు. దీంతో భార్యను నిలదీయగా ప్రియుడితోనే ఉంటానని, విడాకులు ఇచ్చేయాలంటూ డిమాండ్ చేసింది. పది రోజుల్లో విడాకులు ఇవ్వకపోతే ప్రాణం తీస్తానని బెదిరించడంతో బాధితుడు గుంటూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విడాకులు తీసుకుంటే పిల్లల జీవితం నాశనమవుతుందని ఎంత చెప్పినా తన భార్య వినడం లేదని, విడాకులు ఇవ్వనని చెప్పినందుకు ప్రియుడితో కలిసి తనపై దాడి చేసిందని వాపోయాడు. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. Also Read:


By February 18, 2020 at 11:08AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/guntur-man-complaint-to-police-against-wife-over-she-harassed-for-divorce/articleshow/74185725.cms

No comments