Breaking News

ఔటర్ రింగ్‌రోడ్డుపై మరో ఘోర ప్రమాదం.. రంగారెడ్డిలో విషాదం


ఔటర్ రింగ్‌రోడ్డుపై మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని వెనక నుంచి కారు వేగంగా ఢీ కొట్టింది. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. తెల్లవారుజామున మంచు కురుస్తుండడంతో ముందు వెళ్తున్న వాహనం స్పష్టంగా కనిపించక ప్రమాదం జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. Also Read: శంషాబాద్ పరిధిలోని రాళ్ళగూడ వద్ద ఔటర్ రింగ్గు రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. ముందు వెళ్తున్న లారీని బ్రెజా కారు వెనుక నుంచి ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. కారులో ఉన్న బాల్‌ రెడ్డి, నర్సింహ అక్కడికక్కడే మృతి చెందారు. శంకర్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలవడంతో ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించారు. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. Read Also: రంగారెడ్డి జిల్లా ఫారుఖ్ నగర్ మండల్ సోల్‌పేట్ గ్రామానికి చెందిన బాల్‌ రెడ్డి, నర్సింహ, శంకర్ మరో వ్యక్తితో కలిసి కారులో బయలుదేరారు. ఫంక్షన్‌కు హాజరైన నలుగురు వ్యక్తులు.. తెల్లవారుజామున తిరిగి వస్తుండగా కారు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. శంషాబాద్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


By February 01, 2020 at 12:03PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/two-killed-in-road-accident-on-hyderabads-orr/articleshow/73832902.cms

No comments