AP Capital: అమరావతి నుంచి కర్నూలుకు.. తక్షణమే 3 ఆఫీసుల తరలింపు

వెలపూడిలోని మూడు కార్యాలయాలను తరలిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విజిలెన్స్ కమిషనర్ ఆఫీస్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ ఛైర్మన్, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ సభ్యుల ఆఫీసులను కర్నూలుకు తరలించడం శుక్రవారం రాత్రి జీవో జారీ చేసింది. ప్రస్తుతం ఈ కార్యాలయాలు గుంటూరు జిల్లా వెలగపూడిలోని తాత్కాలిక భవనాల్లో కొనసాగుతున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఈ కార్యాలయాలను తక్షణమే కర్నూలు తరలిచండం కోసం తగిన భవనాలను గుర్తించాలని ఆర్ అండ్ బీ చీఫ్ ఇంజినీర్, కర్నూలు జిల్లా కలెక్టర్లను జగన్ సర్కారు ఆదేశించింది. ఏపీ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్గా, విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా, కర్నూలును జ్యుడీషియల్ క్యాపిటల్గా ఏర్పాటు చేసే దిశగా జగన్ సర్కారు అడుగులేస్తోంది. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలని జీఎన్ రావు కమిటీ, బీసీజీ రిపోర్టు సూచించాయి. ఈ నేపథ్యంలో హైకోర్టుతోపాటు, దానికి సంబంధించిన కార్యాలయాలను కర్నూలుకు తరలించే ప్రక్రియలో భాగంగానే జగన్ సర్కారు ఈ మూడు ఆఫీసులను కర్నూలుకు తరలిస్తోందని భావిస్తున్నారు.
By February 01, 2020 at 09:00AM
No comments