Breaking News

ప్రేమకు అడ్డొస్తున్నాడని ప్రియురాలి అన్న దారుణహత్య.. 15నెలల తర్వాత దొరికాడు


జిల్లాలో 15 నెలల క్రితం జరిగిన హత్య కేసును అనంతపురం టూటౌన్ పోలీసులు చేధించారు. ప్రేమ వ్యవహారమే దీనికి కారణమని తేల్చి.. నిందితుడిని అరెస్ట్ చేశారు. తాడిమర్రి మండలం మడుగుపల్లికి చెందిన వీరపు హరి అనంతపురం నగరంలోని రంగస్వామినగర్‌లో ఉంటూ చదువుకునేవాడు. హరితో పాటు అదే గ్రామానికి చెందిన అతడి స్నేహితుడు నవకిషోర్(22) కూడా అతడి గదిలోనే ఉండేవాడు. Also Read: ఈ క్రమంలోనే నవకిషోర్ చెల్లిని హరి ప్రేమించాడు. ఈ విషయం తెలుసుకున్న కిషోర్ అతడిని నిలదీసి ప్రేమ వ్యవహారం మానుకోవాలని సూచించాడు. దీంతో అతడిపై కక్ష పెంచుకున్న హరి చంపేయాలని ప్లాన్ వేశాడు. 2018, డిసెంబర్ 12న మరో స్నేహితుడు శ్యామల్ సాయంతో నవకిషోర్‌ను బుక్కరాయసముద్రం మండలంలోని హెచ్చెల్సీ సమీప ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ అందరూ మద్యం తాగారు. మత్తులో ఉన్న కిషోర్‌ తలపై బండరాయితో మోది చంపేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని కాలువలోకి పడేశాడు. Also Read: తాగిన మత్తులో స్పృహలేకుండా పడిపోయిన శ్యామల్‌ను లేపి నవకిషోర్‌ కాలువలో పడి కొట్టాకుపోతున్నాడని నమ్మించాడు. మృతుడి తల్లిదండ్రులను కూడా అదేవిధంగా నమ్మించి వారిచేత తమ కుమారుడు కనిపించడం లేదని అప్పట్లో టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయించాడు. పోలీసులు కూడా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సీఐ జాకీర్ హుస్సేన్ ఎట్టకేలకు కేసును చేధించి హరిని నిందితుడిని నిర్ధారించారు. అతడిని పట్టుకునే పనిలో నిమగ్నమైన సమయంలోనే గ్రామ వీఆర్వో సాయంతో హరి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. Also Read:


By February 21, 2020 at 09:11AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/anantapur-police-arrested-young-man-over-kills-lovers-brother-case/articleshow/74235586.cms

No comments