Breaking News

నిజామాబాద్ జిల్లాలో విషాదం.. కిరోసిన్ తాగి 11 నెలల చిన్నారి మృతి


మంచి నీళ్లు అనుకుని కిరోసిన్ తాగిన 11 నెలల బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన జిల్లాలో విషాదం నింపింది. కోటగిరి మండలం వల్లభాపూర్‌ గ్రామానికి చెందిన సాయిచరణ్‌, మీనా దంపతులకు ముగ్గురు సంతానం. తొలుత ఇద్దరు ఇద్దరు కుమార్తెలు పుట్టగా 11 నెలల క్రితం బాబు పుట్టాడు. Also Read: శివరాత్రి పండగ సందర్భంగా కుటుంబ సభ్యులు గురువారం ఇంటిని శుభ్రం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలోనే సాయివర్ధన్‌(11 నెలలు) ఇంట్లో ఆడుకుంటూ కట్టెల పొయ్యి వెలిగించేందుకు ఓ సీసాలో ఉంచిన కిరోసిన్‌‌ను మంచినీళ్లు అనుకుని పొరపాటున తాగేశాడు. Also Read: ఈ విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు బాబును బోధన్‌ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడినుంచి నిజామాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. ఇద్దరు అమ్మాయిల తర్వాత పుట్టిన కొడుకు కావడంతో తల్లిదండ్రులు సాయివర్ధన్‌ను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లిదండ్రులు విలపిస్తున్న తీరు స్థానికులను కన్నీరు పెట్టించింది. Also Read:


By February 21, 2020 at 10:12AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/11-months-boy-died-after-drink-kirosine-in-nizamabad/articleshow/74236097.cms

No comments