అర్ధరాత్రి వివాహితపై ప్రియుడి అఘాయిత్యం.. పోలీసులకు పట్టించిన 11 ఏళ్ల కొడుకు
మద్యం మత్తులో ప్రియురాలి ఇంటికి వెళ్లిన ఓ వ్యక్తి 11ఏళ్ల ఆమె కుమారుడిని చావబాదాడు. అంతటితో ఆగకుండా బాలుడిని బయటే నిలబెట్టి ప్రియురాలిని బెడ్రూమ్లోకి లాక్కెళ్లి రాసలీలలు సాగించాడు. దీంతో ఆ బాలుడు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఓ వ్యక్తి తనను కొట్టి తల్లిని అత్యాచారం చేస్తున్నాడని చెప్పాడు. దీంతో పోలీసులు క్షణాల్లో అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. Also Read: వివరాల్లోకి వెళితే.. కృష్ణా జిల్లా తాడిగడప గ్రామానికి చెందిన వ్యక్తి ఓ కార్పోరేట్ కాలేజీలో వంటమేస్త్రిగా పనిచేస్తున్నాడు. అక్కడే పోరంకి గ్రామానికి చెందిన వివాహిత పనిచేస్తోంది. కొంతకాలంగా వారిద్దరి మధ్య అక్రమ సంబంధం కొనసాగుతోంది. శనివారం పోరంకికి వచ్చిన ఆ వ్యక్తి మద్యం తాగిన తర్వాత కోరిక తీర్చుకునేందుకు రాత్రివేళ ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. తలుపు తీసిన వివాహిత కొడుకు(11) ఎవరు కావాలని అడగ్గా అసభ్యంగా మాట్లాడుతూ కొట్టి బయటకు పంపేశాడు. Also Read: అనంతరం ప్రియురాలిని కోరిక తీర్చాలంటూ వేధించాడు. ఇప్పుడు కుదరదని వెళ్లిపోవాలని ఆమె కోరినా పట్టించుకోకుండా బెడ్రూమ్లోకి లాక్కెళ్లి రాసలీలలు మొదలుపెట్టాడు. దీంతో బాలుడు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఓ వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి తన తల్లిపై అత్యాచారం చేస్తున్నాడని చెప్పాడు. పెనమలూరు ఎస్ఐ తమ్మి నాయుడు ఆరుగురు కానిస్టేబుళ్లతో 5 నిమిషాల్లోనే పోరంకిలోని ఆమె ఇంటి వద్ద ప్రత్యక్షమయ్యారు. బాలుడు ఏడుస్తూ ఓ గది వైపు చూపించగా ఎస్ఐ, సిబ్బంది లోపలికి వెళ్లారు. అక్కడ ఆ జంట నగ్నంగా ఉండటాన్ని గమనించి మందుబాబును బయటకు లాక్కొచ్చారు. Also Read: అయితే మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి.. తాను ఓ మాజీ ప్రతినిధిని అనుచరుడని, తనపైనే చేయి వేస్తారా అంటూ కాసేపు అక్కడ రచ్చ చేశాడు. ఎస్ఐను తోసేసి బైక్పై తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు అతడిని పట్టుకుని స్టేషన్కు తరలించారు. ఆపద కాలంలో ధైర్యంగా డయల్ 100కి ఫోన్ చేసి బాలుడిని పోలీసులు అభినందించారు. Also Read:
By February 17, 2020 at 12:59PM
No comments