Breaking News

YS Jagan సర్కారుకు బాబు BAC షాక్.. గవర్నర్‌, స్పీకర్‌కు లేఖ.. సభ వాయిదా


శాసన మండలి రద్దు తీర్మానానికి ఆమోదం తెలిపిన కేబినెట్.. శాసన సభలో ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి కొద్ది సేపటి ముందు షాకిచ్చింది. సోమవారం శాసన సభను నిర్వహించే అంశాన్ని బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో ప్రస్తావించలేదని పేర్కొంటూ.. గవర్నర్‌కు, స్పీకర్ తమ్మినేనికి లేఖ రాసింది. సభల నిర్వహణలో బీఏసీ అజెండాను ఉల్లంఘించారని ఫిర్యాదు చేసింది. ఇప్పటికే ఆమోదించిన బిల్లులపై చర్చ పెట్టి చెడు సాంప్రదాయాలకు నాంది పలికారని ఆరోపించింది. మూడు రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలని బీఏసీలో నిర్ణయించారని.. కానీ ఇష్టానుసారం సభను పొడిగించటం సబబు కాదని పేర్కొంది. శాసన మండలి సెలక్ట్ కమిటీకి పంపిన బిల్లులను అసెంబ్లీలో చర్చించడం రూల్స్‌‌కు విరుద్ధమని టీడీపీ అభిప్రాయపడింది. కౌన్సిల్‌లో మాట్లాడిన అంశాలను శాసన సభలో ప్రస్తావించకూడదని తెలిపింది. రాజ్యాంగ విరుద్ధంగా జరిగే చర్చలో పాల్గొనకూడదనే సభను బహిష్కరించామని టీడీపీ శాసన సభాపక్షం వెల్లడించింది. టీడీపీ లేఖ రాయడంతో.. శాసన సభ సమావేశం ప్రారంభం కాగానే.. అసెంబ్లీ సమావేశాలను కొనసాగించడం కోసం బీఏసీ భేటీ ఏర్పాటు చేయాలని స్పీకర్ తమ్మినేని సీతారాం సీఎం జగన్‌కు సూచించారు. అనంతరం సభను వాయిదా వేశారు. సోమవారం శాసన సభ సమావేశాలకు దూరంగా ఉండాలని టీడీఎల్పీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బీఏసీ సమావేశానికి టీడీపీ హాజరవుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. నిబంధనల ప్రకారం సభను ఎన్ని రోజులు నడపాలి, ఏయే అంశాలను చర్చించాలనే అంశాన్ని బీఏసీ సమావేశంలో చర్చిస్తారు. ఇంతకు ముందు జరిగిన బీఏసీ సమావేశంలో మూడు రోజులపాటు మాత్రమే సభ నడపాలని నిర్ణయించారు. సభను సోమవారానికి పొడిగించారు కాబట్టి.. మరోసారి బీఏసీ సమావేశం నిర్వహించాల్సి ఉంది. ఇదే విషయమై గవర్నర్‌‌కు, స్పీకర్‌కు టీడీపీ లేఖ రాసింది.


By January 27, 2020 at 11:22AM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/tdp-writes-letter-to-governor-and-assembly-speaker-on-violation-of-bac-agenda/articleshow/73654936.cms

No comments