ప్రకాశంలో నిద్రిస్తున్న భర్తను గొడ్డలితో నరికిన భార్య
మద్యానికి బానిసై నిత్యం వేధింపులకు గురి చేస్తున్న భర్తను విసిగివేసారిపోయిన భార్య చివరకు గొడ్డలితో నరికి చంపేసింది. ఈ ఘటన జిల్లా మండలంలోని కోనపల్లెలో బుధవారం జరిగిన హత్య కేసులో కొత్త కోణం బయటకు వచ్చింది. నిద్రపోతున్న భర్తను గొడ్డలితో తలపై నరికి చంపి.. ఆ తర్వాత పిల్లలను తీసుకుని పరారైనట్లు తెలిసింది. Also Read: పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కోనపల్లెకు చెందిన నారు తిరుమలయ్య (38) సీఎస్ పురం మండలానికి చెందిన అల్లూరమ్మతో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లల సంతానం. వీరి కాపురం మొదట్లో సాఫీగానే సాగింది. అయితే తర్వాత తిరుమలయ్య మద్యానికి బానిసయ్యాడు. డబ్బు ఇవ్వాలంటూ భార్యను నిత్యం వేధిస్తుండేవాడు. అయితే భర్త పెట్టే బాధలన్నింటినీ భార్య భరిస్తూనే సంసారాన్ని నెట్టుకొచ్చేది. అయితే మంగళవారం రాత్రి తిరుమలయ్య ఫూటుగా మద్యం తాగి ఇంటికొచ్చాడు. మళ్లీ మద్యం తాగేందుకు రూ.100 ఇవ్వాలంటూ భార్యను అడిగాడు. ఆమె డబ్బు లేవని చెప్పడంతో కట్టెలతో కొట్టాడు. తర్వాత ఆమె చీరలన్నింటినీ బయటవేసి కాల్చేశాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భార్య.. తెల్లవారుజామున నిద్రపోతున్న భర్తపై గొడ్డలితో దాడి చేసింది. తలపై నాలుగు సార్లు నరికింది. చనిపోయాడని నిర్ధారణ చేసుకున్న తర్వాత తన ముగ్గురు పిల్లలను తీసుకుని పరారైంది. దీనిపై ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై ఎస్సై రవీంద్రారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read:
By January 18, 2020 at 12:44PM
No comments