సికింద్రాబాద్లో దారుణం.. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి యువతిని లాడ్జికి తీసుకెళ్లి రేప్

సికింద్రాబాద్లో దారుణ ఘటన జరిగింది. ఉపాధి కోసం నగరానికి వచ్చిన ఓ యువతిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని బుసావల్ ప్రాంతానికి చెందిన ఓ యువతి(24) అనే యువతి డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే చర్లపల్లి రైల్వే కాలనీకి చెందిన వివేకానంద (42) అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఓ పని కోసం 15 రోజుల క్రితం మహారాష్ట్రకు వెళ్లాడు. అక్కడ స్నేహితుడి ద్వారా అతడికి సదరు యువతి రైలులో పరిచయమైంది. తన కుటుంబ పరిస్థితుల గురించి వివేకానందకు చెప్పిన యువతి తనకు ఉద్యోగం చూపించాలని కోరింది. దీంతో అతడు తన మొబైల్ నంబర్ ఇచ్చాడు. Also Read: రెండు వారాల క్రితం యువతికి ఫోన్ చేసిన వివేకానంద హైదరాబాద్ వస్తే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. దీంతో ఆమె శనివారం(జనవరి 18) ఉదయం మహారాష్ట్ర నుంచి సికింద్రాబాద్కు చేరుకుని స్టేషన్ సమీపంలోని ఓ లాడ్జిలో గది తీసుకుని బస చేసింది. అదే రోజు రాత్రి 10.30గంటల సమయంలో తన స్నేహితుడు రాజుతో కలిసి వివేకానంద సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చి యువతిని కారులో ఎక్కించుకున్నాడు. వివేకానంద, రాజు కారులో మద్యం తాగి ఆమెతో బలవంతంగా తాగించారు. కాసేపటికి ఆమెకు మగతగా అనిపించడంతో తనను హోటల్ వద్ద దించాలని కోరింది. తర్వాత వివేకానంద మరో హోటల్లో రూమ్ బుక్ చేసి ఆమెను అక్కడికి మార్పించాడు. Also Read: కాసేపటి తర్వాత వివేకానంద తన స్నేహితుడు రాజును కిందే ఉండమని చెప్పి ఒక్కడే యువతికి రూమ్కి వెళ్లాడు. అర్ధరాత్రి తన రూమ్కి ఎందుకొచ్చారంటూ ఆమె ప్రశ్నించేలోపే తలుపు గడియ పెట్టేసి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితికి చేరుకున్న బాధితురాలు కాసేపటి తర్వాత తేరుకుని డయల్ 100కి ఫోన్ చేసింది. దీంతో గోపాలపురం డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్ వెంటనే హోటల్కు చేరుకుని బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆమెను నగరంలోనే ఉంటున్న బంధువులకు అప్పగించారు. పోలీసులు వివేకానందతో పాటు అతడికి సహకరించిన రాజును అరెస్ట్ చేశారు. ఇద్దరిపై ఐపీసీ 376, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. Also Read:
By January 20, 2020 at 10:42AM
No comments