బాబాయ్ నిర్దోషి.. ‘బర్త్డే కేక్’ కేసును చేధించిన తెలంగాణ పోలీసులు

రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం ‘అయినాపూర్ బర్తే డే కేక్’ కేసును పోలీసులు నాలుగు నెలల తర్వాత చేధించారు. వరుసకు అన్న అయ్యే వ్యక్తితో ఆస్తి తగాదాలున్న యువకుడు ఆయన కుమారుడి బర్త్ డే కోసం కేక్ పంపడం.. అది తిన్న కుటుంబసభ్యుల్లో తండ్రి, కొడుకు మృతిచెందడం,తల్లి, కూతురు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. Also Read: వ్యక్తిగత కక్షలతో అన్న కుటుంబాన్ని అంతం చేయాలన్న కుట్రతోనే అతడు కేక్లో విషం కలిపినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. బాధిత కుటుంబం కూడా ఆ యువకుడే పథకం ప్రకారం ఇలా చేశాడని ఆరోపించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎట్టకేలకు కేసును చేధించారు. అందరూ ఆరోపించినట్లుగా ఈ ఘటనలో ఆ యువకుడి ప్రమేయం లేదని, కేకులో కాలం చెల్లిన రసాయనాలతో తయారు చేయడం వల్లనే అది విషంగా మారి తండ్రీకొడుకుల ప్రాణం తీసిందని తేల్చారు. Also Read: అయినాపూర్కు చెం దిన ఇస్తారిగల్ల రవి, నాగమణి దంపతులకు పూజిత (13), రామ్చరణ్ (11) సంతానం. రవి సొంతూరు దుబ్బాక మండలం భూంపల్లి. రవి తల్లి లక్ష్మికి సోదరి బాలమ్మతో పాటు మరో ముగ్గురు తోబుట్టువులు ఉన్నారు. బాలమ్మ కుమారుడు శ్రీనివాస్. శ్రీనివాస్, రవి కుటుంబాల మధ్య కొన్నాళ్ల నుంచి ఆస్తి తగాదాలున్నాయి. దీంతో భూంపల్లి నుంచి భార్యాపిల్లలతో వెళ్లిపోయిన రవి, అయినాపూర్లో స్థిరపడ్డాడు. గత ఏడాది సెప్టెంబరు 4న అయినాపూర్కు వచ్చిన శ్రీనివాస్.. రవి ఇంటికి వెళ్లాడు. ఆరోజు రవి కొడుకు రామ్చరణ్ పుట్టినరోజు అని తెలుసుకుని సిద్దిపేట తిరిగి వెళ్లిన తర్వాత అదేరోజు రాత్రి 10.30 గంటలకు బస్సులో కేక్ పంపించాడు. Also Read: దాన్ని కట్ చేసిన బాలుడు తల్లిదండ్రులతో పాటు అక్క పూజితకు తినిపించాడు. కాసేపటికి రామ్చరణ్ కడుపు నొప్పి అంటూ పెద్దగా ఏడ్చాడు. కొద్దిసేపటికి పూజిత, రవి, నాగమణి కూడా తీవ్ర అస్వస్థతకు గురవడంతో నలుగురినీ స్థానికులు ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే రవి, రామ్చరణ్ మృతిచెందారు. పూజిత, నాగమణి, ఆస్పత్రిలో అందించిన చికిత్సతో కోలుకున్నారు. తమను చంపాలనే శ్రీనివాస్ విషం కలిపిన కేక్ను పంపాడని నాగమణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. Also Read: దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు, కేక్ తయారీకి వినియోగించిన నమూనాలను పరీక్షల నిమిత్తం హైదరాబాద్లోని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. ఫోరెన్సిక్ నిపుణులు పరీక్షలు జరిపి కేక్లో విషప్రయోగం జరగలేదని, అపరిశుభ్ర వాతావరణంలో కేక్ను తయారు చేయడం.. ఎక్స్పైరీ అయిన రసాయనాలు వాడటం వల్ల ఫంగస్ ఏర్పడి విషంగా మారిందని తేల్చారు. దీంతో శ్రీనివాస్ను కేసు నుంచి తప్పించిన పోలీసులు ఇద్దరు మృతికి కారణమైన సిద్దిపేటలోని న్యూ ఇండియా బేకరీ యజమాని ఎం.హఫీజ్ను పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ కేసు వివరాలను చేర్యాల సర్కిల్ పోలీస్ కార్యాలయంలో హుస్నాబాద్ ఏసీపీ మహేందర్ గురువారం వెల్లడించారు. Also Read:
By January 31, 2020 at 09:04AM
No comments