స్నేహితుల మధ్య అక్రమ సంబంధం చిచ్చు .. కడపలో యువకుడి దారుణహత్య
వారిద్దరు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగారు. కాలంతో పాటు వారి మధ్య స్నేహబంధం బలపడింది. అయితే అక్రమ సంబంధం వారి మధ్య చిచ్చురేపింది. దీంతో ఏడాది కాలంగా వారిద్దరి మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. చివరికి అవి ముదిరి సోమవారం ఘర్షణకు దారితీయడంతో ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. జిల్లా పట్టణంలోని అలీమాబాద్వీధికి చెందిన షేక్ మహమ్మద్ హుస్సేన్(25), ఏజీగార్డన్కు చెందిన షేక్ యూసూఫ్ చిన్నప్పటి నుంచి స్నేహితులు. అయితే యూసూఫ్ బంధువైన ఓ మహిళతో హుస్సేన్ కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలియడంతో వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. పద్ధతి మార్చుకోవాలని సూచించినా హుస్సేన్ వినిపించుకోకపోవడంతో అతడిని చంపేయాలని యూసూఫ్ నిర్ణయించుకున్నాడు. Also Read: సోమవారం తన కుటుంబసభ్యులతో పాటు మరో స్నేహితుడు మౌలాల సాయంతో సోమవారం హుస్సేన్పై కత్తులతో దాడి చేశాడు. దీంతో అతడు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఆ వెంటనే యూసూఫ్ పోలీసులకు లొంగిపోయాడు. మృతుడు హుస్సేన్ తల్లి షేక్ మహబూబున్నీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయచోటి పోలీసులు షేక్ అహమ్మద్ యూసూఫ్బాషా, షేక్ హసన్వలీ అలియాస్ మౌలా, నసీబ్జాన్, అమ్మాజీ, దిల్షాద్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. Also Read:
By January 21, 2020 at 09:53AM
No comments