Breaking News

రేప్ కేసు వెనక్కు తీసుకోలేదని.. బాధితురాలి తల్లిని కొట్టి, గుండెల్లో తన్ని..


ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. అత్యాచార కేసుకు సంబంధించి కేసును వెనక్కు తీసుకోలేదని బాధితురాలి తల్లిని నిందితులు కొట్టి చంపేశారు. కేసు వాపసు తీసుకునేందుకు ఆమె నిరాకరించడంతో వారు ఈ దారుణానికి ఒడిగట్టారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన ఓ బాలిక (13)పై అబిద్‌, మింటు, మెహబూబ్‌, చాంద్‌ బాబు, జమీల్‌, ఫిరోజ్‌ అనే వ్యక్తులు గతేడాది లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో బాలిక కుటుంబ సభ్యులు నిందితులపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. Also Read: ఈ నేపథ్యంలో ఇటీవల బెయిల్‌పై విడుదలైన నిందితులు గత గురువారం బాధితురాలి ఇంటికి వెళ్లారు. కేసును వెనక్కు తీసుకోవాలంటూ బాలికను, ఆమె తల్లిని తీవ్రంగా బెదిరించారు. అయితే వారు కేసు వెనక్కు తీసుకునేందుకు నిరాకరించడంతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. గుండెలపై ఎగిరెగిరి కాళ్లతో తన్నుతూ ఆ ప్రదేశంలో భయోత్పాతం సృష్టించారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన బాలిక తల్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. Also Read: రాష్ట్రంలో శాంతి భద్రతలపై తీవ్ర దుమారం రేగడంతో పోలీసులు వెంటనే స్పందించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు పోలీసులపై కాల్పులకు దిగారు. దీంతో ఇద్దరు నిందితులను కాళ్లపై తుపాకీతో కాల్చి, వారిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే మిగిలిన నిందితులను కూడా అరెస్టు చేసినట్లు ఓ జర్నలిస్టు ట్వీట్ చేశారు.


By January 18, 2020 at 12:06PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/uttar-pradesh-rape-victim-mother-beaten-to-death-by-six-accused/articleshow/73351209.cms

No comments