Breaking News

రేవ్‌ పార్టీ నిర్వాహకుల కోసం పోలీసుల గాలింపు.. ఆందోళనలో బడాబాబులు


జూబ్లీహిల్స్‌లోని ఎఫ్ఏఐ(టాట్) పబ్బులో రేవ్‌ పార్టీ నిర్వహించేందుకు ప్రయత్నించి పరారీలో ఉన్న పబ్ యజమానులతో పాటు నిర్వాహకులను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వారిని గాలించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 10లోని ఎఫ్‌ఏఐ(టాట్‌) పబ్‌లో ఈ నెల 12న రేవ్‌ పార్టీ నిర్వహిస్తుండగా పోలీసులు రైడ్ చేసిన సంగతి తెలిసిందే. వివిధ రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి వారితో అర్ధనగ్న డ్యాన్సులు చేయించడంతో పాటు వ్యభిచారం చేయించేందుకూ ప్రయత్నించినట్లు పోలీసుల విచారణలో తేలింది. Also Read: దీంతో పోలీసులు 21 మంది యువతులను అదుపులోకి తీసుకోగా.. పబ్ యజమానులు సంతోష్‌రెడ్డి, భరత్‌, రేవ్‌ పార్టీ నిర్వాహకులు ప్రసాద్‌, శ్రీనివాస్‌నాయుడు పరారయ్యారు. యువతులను పశ్చిమ్‌ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, బిహార్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌‌లోని నెల్లూరు జిల్లా నుంచి తీసుకొచ్చినట్లు తెలిసింది. ఓ కంపెనీ ప్రతినిధుల కోసం ఈ రేవ్‌ పార్టీ ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ సంస్థను గుర్తించేందుకు ప్రయత్నించే క్రమంలో నిర్వాహకులు, పబ్బు యజమానులు పరారు కావడంతో వారిని పట్టుకునేందుకు బంజారాహిల్స్‌ డివిజన్‌ ఏసీపీ నేతృత్వంలో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. Also Read: అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎఫ్‌ఏఐ పబ్బును సీజ్ చేయాలని హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌, సికింద్రాబాద్‌ ఆర్డీఓలకు జూబ్లీహిల్స్‌ పోలీసులు లేఖలు రాశారు. దీంతో పాటు పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని లిస్బాన్‌ పబ్‌ను కూడా మూసివేయించనున్నట్లు డీసీపీ వెల్లడించారు. సినిమాల్లో అవకాశాల కోసం వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే యువతులను అవకాశాల పేరుతో ఇలాంటి రొంపిలోకి దించుతున్నారని పోలీసులు చెబుతున్నారు. Also Read:


By January 15, 2020 at 08:27AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/jubilee-hills-police-searching-for-rave-party-organizers-fia-pub/articleshow/73262009.cms

No comments