యాదగిరిగుట్ట: కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తున్న ఇండిపెండెంట్.. టీఆర్ఎస్ బంపర్ ఆఫర్!

హంగ్ వచ్చిన మున్సిపాలిటీల్లో ఎలాగైనా పాగా వేయాలని అధికార ప్రయత్నాలు చేస్తోంది. ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సాయంతో మున్సిపాలిటీ పీఠాన్ని దక్కించుకోవడానికి అధికార పార్టీ ప్రయత్నిస్తోంది. ఇండిపెండెంట్లను తమ వైపు తిప్పుకోవడానికి కూడా ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. కాగా మున్సిపాలిటీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ మున్సిపాలిటీలో మొత్తం 12 స్థానాలు ఉండగా.. టీఆర్ఎస్ 4, కాంగ్రెస్-సీపీఐ కూటమి ఐదు సీట్లను గెలుపొందింది. ముగ్గురు ఇండిపెండెంట్లు విజయం సాధించారు. మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడం కోసం ఇండిపెండెంట్లపై టీఆర్ఎస్, కాంగ్రెస్ ఫోకస్ చేశాయి. ఇద్దరు ఇండిపెండెంట్లు కాంగ్రెస్కు మద్దతు పలికారు. దీంతో ఆ పార్టీ బలం ఏడుకు చేరింది. మరో ఇండిపెండెంట్ టీఆర్ఎస్కు సపోర్ట్ చేశారు. మరో ఇండిపెండెంట్ను తమ వైపు తిప్పుకొంటే.. ఎమ్మెల్యే గొంగిడి సునీత ఎక్స్అఫీషియో ఓటు ద్వారా పీఠాన్ని దక్కించుకోవచ్చని టీఆర్ఎస్ భావించింది. నాలుగో వార్డు నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసి విజయం సాధించిన విజయలక్ష్మీ తమకు మద్దతు పలుకుతుందని భావించారు. ఆమెను కాంగ్రెస్ నాయకులు కిడ్నాప్ చేశారని ప్రచారం మొదలుపెట్టారు. దీనికి కౌంటర్గా తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, ఇష్టపూర్వకంగానే కాంగ్రెస్కు మద్దతు పలుకుతున్నానని ఆ పార్టీ నేతలు ఆమెతో వీడియో సందేశాన్ని రిలీజ్ చేయించారు. ఎలాగైనా యాదగిరిగుట్టను దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న టీఆర్ఎస్.. మాకు మీరు సపోర్టు చేయడం కాదు.. మేమే మీకు సపోర్ట్ చేస్తాం.. మీకే చైర్పర్సన్ పదవి ఇస్తాం, మాతో చేతులు కలపండని విజయలక్ష్మీకి ఆఫర్ ఇచ్చింది. ఆమె ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
By January 27, 2020 at 08:28AM
No comments