నిర్భయ కేసు.. ముకేశ్ పిటిషన్ కొట్టివేసిన సుప్రీం, మరణ శిక్ష తప్పదిక!

నిర్భయ దోషుల్లో ఒకరైన దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. ఆయన వాదనలు అర్హమైనవి కావని పేర్కొంది. జైల్లో తనను హింసించారని ముకేశ్ పేర్కొనగా.. అన్ని పత్రాలనూ రాష్ట్రపతి ముందు ఉంచారని, వాటన్నింటిని పరిగణనలోకి తీసుకునే క్షమాభిక్ష పిటిషన్ను ఆయన తిరస్కరించారని తెలిపింది. హింసకు గురయ్యారనే కారణంతో రాష్ట్రపతి నిర్ణయాన్ని సవాల్ చేయడం కుదరదని తేల్చి చెప్పింది. ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు నలుగురు నిర్భయ దోషులను ఉరితీయాలని ట్రయల్ కోర్టు డెత్ వారంట్ జారీ చేసింది. దీంతో దోషుల్లో ఒకరైన ముకేశ్ రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరారు. ముకేశ్ అభ్యర్థనను రాష్ట్రపతి తిరస్కరించారు. దీంతో కోవింద్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. ముకేశ్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని అత్యవసరంగా విచారణకు చేపట్టిన న్యాయస్థానం.. మంగళవారం వాదనలు విన్నది. ఈ సందర్భంగా.. ముకేశ్ జైల్లో అత్యాచారానికి గురయ్యాడని అతడి తరఫు లాయర్ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో మరో దోషి అయిన అక్షయ్ కుమార్ శనివారం సుప్రీంలో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. ఇప్పటికే ఇద్దరు దోషుల పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. అక్షయ్ దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించాల్సి ఉండటంతో.. ఫిబ్రవరి 1న నిర్భయ దోషులను ఉరితీయడం సాధ్యపడకపోవచ్చు. మరోసారి డెత్ వారంట్ జారీ చేయాల్సి రావచ్చు.
By January 29, 2020 at 10:49AM
No comments