Breaking News

‘ఏపీకి మూడు రాజధానులే ముద్దు’.. విజయవాడలో వైసీసీ మద్దతు ర్యాలీ


ఓ వైపు మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంతంలో ఆందోళనలు కొనసాగుతుంటే విజయవాడలో మాత్రం మద్దతుగా భారీ ర్యాలీ జరిగింది. నగరంలోని బీఆర్‌టీఎస్ రోడ్ నుంచి మధురా నగర్ వరకు సాగిన శాంతి ర్యాలీలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, మహిళలు భారీగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, నేతలు మల్లాది విష్ణు, సామినేని ఉదయభాను తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అమరావతికి ఎలాంటి అన్యాయం చేయడం లేదన్నారు. అమరావతి ప్రాంతంలో రైతుల పేరుతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాటకాలు ఆడుతున్నారని, ప్పుడు నివేదికలు ఇచ్చే సంస్కృతి చంద్రబాబుకే ఉందని విమర్శించారు. ప్రజలంతా పాలనా వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ కోరుకుంటున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రజలను ఎంతలా రెచ్చగొట్టాలని చూస్తున్నా. ఆయన పాచికలు పారడం లేదన్నారు. ఆయన ఇచ్చిన ఛలో అసెంబ్లీ పిలుపుకు కనీస స్పందన కూడా రాలేదన్నారు. రాష్ట్రానికి మూడు రాజధానులుండాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని శ్రీనివాస్ అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదన్నారు.


By January 19, 2020 at 02:08PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/ysrcp-rally-from-vijayawada-over-support-to-3-capital/articleshow/73373810.cms

No comments