వ్యభిచారం చేయాలంటూ టిక్టాక్ ఫ్రెండ్స్ వేధింపులు.. ముగ్గురు పిల్లల తల్లి ఆత్మహత్య

టిక్ టాక్ ద్వారా పరిచయమైన ఫ్రెండ్స్ చేయాలంటూ వేధింపులకు గురిచేయడంతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. తమిళనాడులోని విల్లుపురం జిల్లా సెంజి సమీపంలోని సత్యమంగళం గ్రామానికి చెందిన కడల్కన్ని (39) అనే మహిళ భర్త కొన్నాళ్ల క్రితం చనిపోయాడు. దీంతో ఆమె ముగ్గురు పిల్లలతో కలిసి పుట్టింట్లోనే ఉంటోంది. Also read: అప్పుడప్పుడు టిక్టాక్లో వీడియోలు చేసే ఆమెకు చెన్నైకి చెందిన సుమతి, లత, కవిత ఫ్రెండ్స్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే వ్యభిచారం చేయాలంటూ ఆమెను వేధించడం మొదలుపెట్టారు. తాను అలాంటి దానినిన కాదని చెప్పినా వినిపించుకోకుండా ఆమె ఇంటికి ఇద్దరు విటులను పంపించారు. దీంతో విసిగిపోయిన కడల్కన్ని సత్యమంగళం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఇంటికి ఇద్దరు విటులను పంపి వ్యభిచారం చేయాలని ముగ్గురు ఫ్రెండ్స్ వేధిస్తున్నారని, లేకపోతే తమకు రూ.2లక్షలు ఇవ్వాలంటూ బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. Also read: దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓ వైపు దర్యాప్తు చేస్తుండగానే ఆ ముగ్గురి వేధింపులు అధికమయ్యాయి. దీంతో కలత చెందిన కడల్కన్ని ఆదివారం రాత్రి ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు ఆమె కాపాడి సమీపంలోని ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయింది. తల్లి ఆత్మహత్యతో ముగ్గురు బిడ్డలు అనాథలుగా మారారు. Also read:
By January 29, 2020 at 11:22AM
No comments