Breaking News

కోర్టు కస్టడీకి పొళ్లాచ్చి సెక్స్ స్కాండల్‌ కేసు నిందితులు


తమిళనాడులో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో నలుగురు నిందితులను ఫిబ్రవరి 11 వరకు కోర్టు కస్టడీలో ఉండాలని జడ్జి ఆదేశించారు. కోయంబత్తూరు జిల్లా పొళ్లాచ్చిలో పలువురు కాలేజీ విద్యార్థినులు, టీచర్స్, లేడీ డాక్టర్లను లైంగికంగా వేధించి వీడియోలు చిత్రీకరించి ఓ ముఠా నగదు వసూలు చేసింది. ఓ కాలేజీ విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పొళ్లాచ్చి ఆల్‌ వుమెన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. తిరునావుకరసు, శబరిరాజన్‌ సహా నలుగురిని అరెస్టు చేశారు. ఈ కేసు తీవ్రత కారణంగా రాష్ట్ర ప్రభుత్వం విచారణణు సీబీఐకి అప్పగించింది. దీంతో కేసును కోయంబత్తూరు చీఫ్‌ క్రిమినల్‌ కోర్టు నుంచి జిల్లా ప్రాథమిక సెషన్‌ కోర్టుకు మార్చారు. ఫిబ్రవరి 11న కేసు విచారణ ప్రారంభమవుతుందని న్యాయమూర్తి తెలిపారు. Also Read: సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలతో స్నేహం చేసి, తర్వాత వారిని ఏకాంత ప్రదేశాలకు తీసుకువెళ్లి లైంగికంగా వేధించి ఆ వీడియోలతో బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న ఘటన తమిళనాడులో తీవ్ర కలకలం రేపింది. దేశవ్యాప్తంగానూ దీనిపై చర్చ జరిగింది. తనను వేధించొద్దంటూ ఓ అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌ను వేడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు శబరిరాజన్‌, వసంత కుమార్, సతీష్, తిరునవుక్కరసు అనే నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరంతా పొల్లాచ్చి పట్టణానికి చెందినవారే. వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read:


By January 29, 2020 at 10:37AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/pollachi-sexual-assault-accused-gets-court-custody-on-february-1th/articleshow/73720959.cms

No comments