ఆర్టీసీ బస్సు కింది పడి యువతి దుర్మరణం.. హైదరాబాద్లో విషాదం

హైదరాబాద్లోని యూసుఫ్గూడలో మంగళవారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు కంపెనీ పనిచేస్తున్న యువతి ఆర్టీసీ బస్సు కింద పడి ప్రాణాలు కోల్పోయింది. మృతురాలిని సాయి దీపికారెడ్డిగా గుర్తించారు. జూబ్లీహిల్స్లోని అపర్ణ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్న ఆమె మంగళవారం ఉదయం స్కూటీపై ఆఫీసుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. Also Read: పంజాగుట్ట నుంచి వెళ్లే మార్గంలో ఆంధ్రా బ్యాంక్ వద్ద సమీపంలో వెళ్తుండగా సాయి దీపికారెడ్డి స్కూటీ అదుపుతప్పింది. ఈ క్రమంలోనే కొండాపూర్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న( రూట్ నం. 10H) ఏపీ 11జెడ్ 7197 నంబర్ గల మెట్రో బస్సు ఆమెను వెనుక నుంచి ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో దీపిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. Also Read: సాయి దీపికారెడ్డి దుర్మరణంతో ఆమె కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఉదయాన్నే ఆఫీసుకుని వెళ్లొస్తానని చెప్పి వెళ్లిన ఆమె విగతజీవిగా మారడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు ఈ ప్రమాదంతో యూసుఫ్గూడ ప్రాంతలో ట్రాఫిక్ జామ్ అయింది. అందరూ ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేసి రాకపోకలు పునరుద్ధరించారు. Also Read:
By January 28, 2020 at 11:38AM
No comments