Breaking News

పబ్జీకి మరో ప్రాణం బలి.. తల్లిదండ్రులు తిట్టారని ఉరేసుకున్న టెన్త్ విద్యార్థి


పబ్‌బీ గేమ్‌కు మరో విద్యార్థి ప్రాణం బలైపోయింది. పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నా పట్టించుకోకుండా నిత్యం పబ్‌జీ గేమ్‌లోనే మునిగిపోతున్నందుకు తల్లిదండ్రులు తిట్టారన్న కోపంతో ఓ బాలుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామానికి చెందిన తమ్మనబోయిన భీమరాజు, విజయనాగిని దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు దీపక్‌సాయి (15) ప్రభుత్వ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతుండగా, రెండో కుమారుడు కళ్యాణ్‌ అక్కడే ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. Also Read: మొదటి నుంచి చదువులో చురుకుగా ఉండే దీపక్‌సాయి పదో తరగతిలో మంచి మార్కులు సాధిస్తాడని తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే కొంతకాలంగా పబ్‌జీ గేమ్‌కు బానిసైన బాలుడు చదువును పక్కన పెట్టేశాడు. ఖాళీ దొరికినప్పుడల్లా ఆ గేమ్‌ ఆడుతూనే ఉండేవాడు. పరీక్షలు సమీపిస్తున్నా పుస్తకాలు పట్టుకోకుండా నిత్యం గేమ్‌ ఆడటమేంటని కొద్దిరోజులుగా తల్లిదండ్రులు తిడుతున్నారు. పరీక్షలు ముగిసేవరకు సెల్‌ఫోన్ ముట్టుకోవద్దని హెచ్చరించి అతడి నుంచి మొబైల్ లాక్కున్నారు. దీంతో మనస్తాపం చెందిన దీపక్ శుక్రవారం రాత్రి నైట్ ట్యూషన్‌కు వెళ్తున్నానని తల్లిదండ్రులకు చెప్పి బయటకు వెళ్లాడు. Also Read: హైస్కూల్‌ వెనుక నుంచి లోపలికి ప్రవేశించి ప్రాంగణంలోని స్టేజీ పక్కనే ఉన్న భవనం రెండో ఫ్లోర్ పిల్లర్‌కు చీరతో ఉరి వేసుకున్నాడు. శనివారం ఉదయం స్కూల్‌ను శుభ్రం చేయడానికి వచ్చిన ఆయా దీపక్ మృతదేహాన్ని చూసి భయంతో హెడ్‌మాస్టర్‌కు ఫోన్ చేసింది. ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందిచడంతో ఏఎస్‌ఐ బి.వెంకటేశ్వరరావు, చల్లపల్లి సీఐ ఎంవీ నారాయణ, సిబ్బందితో కలసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. Also Read:


By January 26, 2020 at 10:55AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/class-10th-student-commits-suicide-in-krishna-district-over-pubg-addiction/articleshow/73628523.cms

No comments