Breaking News

కట్నపిశాచిగా మారిన ఎంపీడీవో.. భార్యకు చిత్రహింసలు పెడుతూ పైశాచికం


ప్రభుత్వ ఉద్యోగం.. మంచి జీతం. సమాజంలో గౌరవం. అయినప్పటికీ ఆ ఎంపీడీవో కట్నపిశాచిగా మారాడు. అదనపు కట్నం తీసుకురావాలంటూ భార్యకు చిత్రహింసలు పెడుతున్నాడు. చేతులపై వేడినీళ్లు పోయడం, కత్తితో చేతులపై గాట్లు పెడుతూ సైకోలో ప్రవర్తిస్తున్నాడు. భర్త పెట్టే వేధింపులు ఇన్నాళ్లూ భరిస్తూ వస్తున్న బాధితురాలు చివరకు మీడియా ముందుకొచ్చి తన గోడు వెళ్లబోసుకుంది. Also Read: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన జగదీశ్ అనిల్‌కుమార్ ప్రస్తుతం తెలంగాణలోని కుమ్రుంభీం జిల్లా సిర్పూర్(టి) ఎంపీడీవోగా పనిచేస్తున్నారు. ఆయనకు 2018, అక్టోబర్ 15న మేరీ కుమారితో వివాహమైంది. పెళ్లి సమయంలో రూ.52లక్షల కట్నం తీసుకున్న ఆయన కొద్దిరోజులకు అదనపు కట్నం తీసుకురావాలంటూ భార్యను వేధించడం మొదలుపెట్టాడు. తన మాట వినకపోవడంతో ఇటీవల రెండు చేతులపై వేడినీళ్లు పోశాడు. దీంతో ఆమె చర్మం బొబ్బలెక్కింది. రెండ్రోజుల క్రితం కత్తితో చేతికి గాట్లు పెట్టి ఇంట్లో నుంచి బయటకు తోసేశాడు. Also Read: దీంతో మేరీ నేరుగా ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకుంది. ఆరోగ్యం కాస్త కుదుటపడంతో ఆదివారం కాగజ్‌నగర్‌లో ప్రెస్‌మీట్ పెట్టి తాను అనుభవించిన నరకాన్ని వివరించింది. తనను హింసిస్తున్న భర్తను జైలుకు పంపాలని, తనకు న్యాయం చేయాలని కన్నీరు పెట్టుకుంది. దీనిపై తాను జిల్లా ఎస్పీతో పాటు పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పింది. ఎంపీడీవో జగదీశ్‌పై ఆయన భార్యే ఆరోపణలు చేయడాన్ని పోలీసులు స్పందించారు. ఆయనపై గృహచట్టంతో పాటు, వరకట్న వేధింపుల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By December 16, 2019 at 11:50AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/case-booked-on-sirpur-t-mpdo-over-dowry-harassment/articleshow/72737731.cms

No comments