Breaking News

‘భర్త నన్ను వదిలేసి ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్నాడు’.. పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు


తన భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని నన్ను పట్టించుకోవడం లేదని, తన సంసారాన్ని నిలబెట్టాలని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన సోమవారం అనంతపురంలో చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ‘స్పందన’ కార్యక్రమంలో మహిళ ఫిర్యాదు చేయడంతో ఎస్పీ సత్యఏసుబాబు విచారణకు ఆదేశించారు. Also Read: ఎన్‌పీ కుంటకు చెందిన మహిళకు కదిరికి చెందిన ఓ వ్యక్తితో కొన్నాళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. అయితే తన భర్తకు కొద్దినెలల క్రితం ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేసే యువతితో పరిచయమై అక్రమ సంబంధానికి దారితీసిందని, వారిద్దరు తనను చంపేసి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ వేసుకున్నట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన జీవితాన్ని నాశనం చేయొద్దని భర్తను ఎంత వేడుకున్నా కనికరించడం లేదని వాపోయింది. Also Read: దీనిపై విచారణ చేసి బాధితురాలికి న్యాయం చేయాలని ఎస్పీ ఆదేశించడంతో పోలీసులు ఆమె భర్తను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. భార్యను పట్టించుకోకుండా చెడు తిరుగుళ్లు తిరిగితే జైలుపాలు కావాల్సి వస్తుందని హెచ్చరించి ఆమెతో పంపించారు. అతడు మరోసారి వేధిస్తే తమకు ఫిర్యాదు చేయాలని బాధితురాలికి సూచించారు. Also Read:


By December 03, 2019 at 09:00AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/kadiri-man-illegal-affair-with-another-woman-his-wife-complaint-to-police/articleshow/72341808.cms

No comments