ఇంటర్ బాలికపై అత్యాచారం.. మామ, అల్లుడిపై పోక్సో కేసు

హైదరాబాద్లోని నారాయణగూడలో ఘోరం చోటుచేసుకుంది. మాయమాటలు చెప్పి తీసుకెళ్లి గదిలో నిర్బంధించి బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడికి అతడి మామ సైతం సహకరించాడు. కామాటిపురకు చెందిన బాలిక (16) నారాయణగూడలోని ఓ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ నెల 11న ఉదయం బాలికను తల్లి కాలేజీ దగ్గర దిగబెట్టి వెళ్లింది. సాయంత్రం వచ్చేసరికి యువతిని గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లారు. Also Read: దీనిపై బాలిక తల్లి స్థానిక కామాటిపుర పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ రాంబాబు ‘జీరో’ ఎఫ్ఐఆర్ కింద కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. ఆ తర్వాత సంఘటన ఠాణా పరిధిలో జరిగిందని తెలిసి కేసును ఆన్లైన్ ద్వారా ఆ స్టేషన్కు బదిలీ చేశారు. గాలింపు చర్యలు మొదలుపెట్టిన నారాయణగూడ పోలీసులు ఎట్టకేలకు ఆ బాలికను దూద్బౌలీ, సిప్లీగంజ్కు చెందిన ఠాకూర్ అమర్సింగ్ (19) తీసుకెళ్లినట్లు గుర్తించారు. Also Read: బాలికను కార్వాన్లోని సబ్జీమండిలో కారుడ్రైవర్గా పని చేసే తన మామా లఖన్ సింగ్ (50) ఇంట్లో గదిలో నిర్బంధించినట్లు నిర్ధారించుకున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నారాయణగూడ పోలీసులు ఇంటిపై దాడి చేసి బాలికను నిందితుల చెర నుంచి విడిపించారు. యువకుడు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు బాలిక చెప్పింది. దీంతో ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. అమర్సింగ్, అతడికి ఆశ్రయమిచ్చిన మామ లఖన్సింగ్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. Also Read:
By December 14, 2019 at 11:54AM
No comments