భవానీ మాలలో వచ్చి.. గుంటూరు జిల్లాలో నాలుగేళ్ల బాలుడి కిడ్నాప్

జిల్లా రేపల్లెలో నాలుగేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. భవానీ మాలలో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి పట్టణంలోని 24వ వార్డుకు చెందిన వేముల గోకుల శ్రీనాథ్(4)ను ఎత్తుకెళ్లాడు. రేపల్లెకు చెందిన శ్రీనివాసరావుకు పిడుగురాళ్లకు చెందిన తిరుపతమ్మతో కొన్నాళ్ల క్రితం వివాహమైంది. వారి కుమారుడు గోకుల శ్రీనాథ్ ప్రస్తుతం రేపల్లెలో ఉంటున్న నాయనమ్మ వద్ద ఉంటున్నాడు. Also Read: మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో తిరుపతమ్మ గుడి వద్ద భవానీమాల ధరించిన ఓ యువకుడు కూర్చొని ఉన్నాడు. ఇది గమనించిన బాలుడి నాయనమ్మ ఏడుకొండలు.. అతడి వివరాలు కనుక్కుని అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించింది. కాసేపటి తర్వాత శ్రీనాథ్ పక్కింట్లో ఉండే వెంకటలక్ష్మి దగ్గరకు వెళ్తున్నట్లు చెప్పి బయటకు వెళ్లాడు. బాలుడు ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో ఆమె వెంకటలక్ష్మి ఇంటికి వెళ్లి చూడగా శ్రీనాథ్ కనిపించలేదు. దీంతో ఆమె చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోయింది. ఇంతలో ఓ యువతి వచ్చి ‘మీతో మాట్లాడిన భవానీమాల వేసుకున్న వ్యక్తి మీ మనవడి చేయి పట్టుకుని రైల్వేస్టేషన్ వైపు నడిపించుకుని తీసుకెళ్తున్నట్లు చూశాన’ని చెప్పింది. Also Read: దీంతో అతడే తన మనవడిని కిడ్నాప్ చేసి ఉంటాడని భావించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు స్థానిక రైల్వేస్టేషన్ వద్ద సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించారు. అందులో భవాని మాలధారి బాలుడ్ని తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. దీంతో బాలుడి సమాచారాన్ని పోలీసులు వెంటనే జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లకు పంపారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించగా కిడ్నాపర్ బాలుడిని తీసుకెళ్లున్న దృశ్యాలు గుంటూరు బస్టాండ్లో వద్ద సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో కిడ్నాపర్ కోసం గుంటూరులో గాలిస్తున్నారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని అర్బన్ సీఐ సింగిరేసుల సాంబశివరావు పేర్కొన్నారు. Also Read:
By December 11, 2019 at 09:10AM
No comments