Breaking News

‘దిశ’కు న్యాయం జరిగింది.. కామాంధులకు కనువిప్పు కావాలి: పవన్‌కళ్యాణ్


మన దేశంలో ఆడపడుచుల రక్షణకు ప్రస్తుతం ‘దిశ’ ఉదంతం చట్టాలు సరిపోవని ‘దిశ’ ఘటన హెచ్చరిస్తోందని పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ప్రజలు కోరుకున్న విధంగా ఈ ఘటనలో సత్వర న్యాయం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా దిశ ఆత్మకు శాంతి కలగాలని, ఈ విషాదం నుంచి ఆమె తల్లిదండ్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఓ ప్రకటన వెలువరించారు. Also Read: ‘ఆ కరాళ రాత్రి వేళ నలుగురు ముష్కరుల మధ్య దిశ ఎంత నరకాన్ని అనుభవించిందో తలుచుకుంటేనే ఆవేశం, ఆక్రోశం, ఆవేదనతో శరీరం ఉడికిపోతోంది. జాతి యావత్తూ తక్షణ న్యాయం కోసం కోరుకోవడానికి ఈ ఘటన తీవ్రతే కారణం. నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు కాబట్టి ‘దిశ’ ఘటన ముగిసిందని ఇంతటితో వదిలిపెట్టకూడదు. మరే ఆడబిడ్డకు ఇలాంటి పరిస్థితి రాకూడదు. నిర్భయ ఘటన తర్వాత బలమైన మన పార్లమెంటు బలమైన చట్టాన్ని తీసుకొచ్చినా అమ్మాయిలపై అఘాయిత్యాలు ఆగలేదు.’ Also Read: ‘ఆడపిల్లల వైపు వక్రబుద్ధితో చూడాలంటేనే భయపడేలా కఠినమైన చట్టాలు రావాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఘటనల్లో శిక్షలపై ఇతర దేశాల్లో ఎలాంటి చట్టాలున్నాయో అధ్యయం చేశాలి. మేధావులు ముందుకు కదిలి ఇలాంటి ఘాతుకాలకు చరమగీతం పాడాలి. ఇలాంటి క్రూరమైన కేసుల్లో కోర్టుల్లోనూ రెండు మూడు వారాల్లో శిక్షలు పడేలా నిబంధనలు రావాలి. నేరస్థాయిని బట్టి ఉరిశిక్ష అయినా, మరే శిక్ష అయినా బహిరంగంగా అమలు చేయాలి’ అని పవన్‌కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. Also Read:


By December 06, 2019 at 12:54PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/janasena-party-chief-pawan-kalyan-responds-on-disha-case-accused-encounter/articleshow/72396776.cms

No comments