Breaking News

‘నీ కూతురిని రాత్రికి పంపు... ఎకరం రాసిస్తా’ కామాంధుడి నీచపు వ్యాఖ్యలు


‘దిశ’ నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన తర్వాత దేశవ్యాప్తంగా కామాంధులందరికీ అలాంటి శిక్షలే వేయాలంటూ అన్ని వర్గాల నుంచి డిమాండ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇటీవలే ఇద్దరు కిరాతకులు తమకూ అలాంటి గతే పడుతుందని భయపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటివి ఎన్ని ఘటనలు జరిగినా తాము మాత్రం వెనక్కి తగ్గేది లేదంటూ ఎక్కడోచోట మృగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా తెలంగాణలోని భూపాలపల్లిలో ఓ కామాంధుడు నీచపు వ్యాఖలు చేసి యువతి మరణానికి కారణమయ్యాడు. Also Read: వివరాల్లోకి వెళ్తే.. జిల్లా పర్లపల్లికి చెందిన గాదం ఐలయ్య అనే వ్యక్తి బుధవారం గ్రామంలో ఓ ఇంటికి మద్యం మత్తులో వెళ్లాడు. ఆ కుటుంబంలో పెళ్లీడికి వచ్చిన ఓ యువతి ఉంది. ఆమెపై ఎప్పటి నుంచో కన్నేసిన ఐలయ్య యువతి తల్లి వద్ద ఓ ప్రస్తావన తెచ్చాడు. ‘ నీ కూతురంటే నాకు మోజు. ఆమెను ఒక్కరాత్రికి నా దగ్గరకు పంపిస్తే ఎకరం పొలం రాసిస్తా’ అంటూ అహస్యంగా మాట్లాడాడు. ఐలయ్య మాటలకు చిర్రెత్తుకొచ్చిన యువతి తల్లి ఆ కామాంధుడిని అక్కడే నిలదీసింది. Also Read: వెంటనే గ్రామ పెద్దల వద్దకు వెళ్లి ఐలయ్యపై ఫిర్యాదు చేసింది. పంచాయతీ పెట్టి అతడిని శిక్షించాలని కోరింది. దీంతో గ్రామపెద్దలు గురువారం పంచాయతీ నిర్వహిస్తామని చెప్పారు. ఈ వార్త గ్రామంలోని అందరికీ తెలియడంతో యువతి మనస్తాపానికి గురైంది. పంచాయతీ పెడితే తన పరువు పోతుందన్న భయంతో ఇంట్లోనే పురుగుల మందు తాగేసింది. ఇది గమనించిన తల్లి కూతురిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో గ్రామంలో విషాయఛాయలు అలుముకున్నాయి. Also Read:


By December 12, 2019 at 10:35AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/minor-girl-commits-suicide-over-sexual-harassment-in-telangana/articleshow/72485186.cms

No comments