భార్య వేధింపులు, దుబారా ఖర్చు భరించలేక టెక్కీ ఆత్మహత్మ

భార్య వేధింపులు తాళలేక ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. భార్య పెడుతున్న దుబారా ఖర్చులు భరించలేక, నిత్యం ఆమె సూటిపోటి మాటలకు మనస్తాపం చెందిన బలవన్మరణానికి పాల్పడ్డాడు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న శ్రీనాథ్కు భార్య రేఖ, కుమార్తె ఉన్నారు. ఇటీవల అతడు హోమ్లోన్ మీద ఓ ఫ్లాట్ కొనుగోలు చేసి కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. Also Read: ఇటీవల ఆర్థిక అవసరాలు పెరగడంతో శ్రీనాథ్కు లోన్ ఈఎంఐ కట్టడమే కష్టంగా మారింది. ఇవన్నీ పట్టించుకోని భార్య రేఖ దుబారా ఖర్చులు చేయడం మొదలుపెట్టింది. దీంతో పద్ధతి మార్చుకోవాలని అతడు ఎంత చెప్పినా ఆమె వినిపించుకోకుండా ఆదాయానికి మించి ఖర్చులు చేస్తోంది. దీనికి తోడు ఫ్లాట్ను తన తండ్రి పేరుమీద రిజిస్టర్ చేయాలని రేఖ భర్తను తీవ్రంగా పట్టుబడుతోంది. దీంతో కొద్దిరోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. Also Read: భార్య కలిగించే మానసి వేదనతో విసిగిపోయిన శ్రీనాథ్ చివరికి చావే పరిష్కారమనుకున్నాడు. తన ఫ్లాట్లోనే ఫ్యాన్కు ఉరేసుకుని చేసుకున్నాడు. పోలీసుల విచారణలో రేఖ వేధింపులే శ్రీనాథ్ ఆత్మహత్యకు కారణమని తేలడంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By December 15, 2019 at 12:28PM
No comments