యాధృచ్ఛికం... ‘దిశ’ దశదిన కర్మ రోజే నిందితుల ఎన్కౌంటర్

పదిరోజులుగా దేశాన్ని కుదిపేసిన ‘దిశ’ ఘటనకు పోలీసులు అదిరిపోయే ముగింపు ఇచ్చారు. ఆమెను చంపి దహనం చేసిన ఘటనా స్థలంలోనే నిందితులను పోలీసుల ఎన్కౌంటర్ చేయడంపై ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. వేలాది సంఖ్యలో ప్రజలు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు జేజేలు కొడుతున్నారు. దిశకు పదిరోజుల్లోనే న్యాయం చేశారంటూ అభినందనలు చెబుతున్నారు. పోలీసులకు పూలవర్షం కురిపిస్తున్నారు. Also Read: యాధృచ్ఛికమో ఏమో గానీ ‘దిశ’ ప్రాణాలు కోల్పోయి నేటికి పదిరోజులు అవుతోంది. దీంతో తల్లిదండ్రులు ఆమెకు దశదిన కర్మ నిర్వహిస్తున్నారు. పుట్టెడు శోకంతో కన్నకూతురికి కర్మ నిర్వహించేందుకు సిద్ధమైన దిశ తల్లిదండ్రులు ఉదయమే శుభవార్త విన్నారు. నలుగురు నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసినట్లు తెలియడంతో దిశ పేరెంట్స్తో పాటు బంధువులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. తమ కూతురికి పోలీసులు పది రోజుల్లోనే న్యాయం చేశారంటూ వారు మీడియాతో చెప్పారు. Also Read: తమ కూతురికి దశదిన కర్మ నిర్వహిస్తున్న రోజే ఆ కామాంధులను కాల్చి చంపడం యాధృచ్ఛికంగా భావిస్తున్నామని, నిందితుల ఎన్కౌంటర్తో ‘దిశ’ ఆత్మ శాంతిస్తుందని పేర్కొన్నారు. తన అక్కపై అఘాయిత్యానికి పాల్పడిన దహనం చేసిన నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేయడం హర్షణీయమని దిశ సోదరి అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి వారందరూ ధన్యవాదాలు తెలిపారు. Also Read:
By December 06, 2019 at 10:08AM
No comments