Breaking News

ఆత్మరక్షణ కోసమే వారిని ఎన్‌కౌంటర్ చేయాల్సి వచ్చింది: పోలీసులు


దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ‘దిశ’ హత్యకేసు నిందితులను తెలంగాణ పోలీసులు పది రోజల్లోనే ఎన్‌కౌంటర్ చేశారు. దీంతో నిన్నటివరకు పోలీసుల తీరుపై విమర్శలు గుప్పించిన వారే.. ఈరోజు వారిపై పూలవర్షం కురిపిస్తున్నారు. ‘దిశ’ పొట్టన పెట్టుకున్న నలుగురు కామాంధులను పోలీసులు కాల్చిచంపడాన్ని అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయి. మృగాళ్లకు సరైన శిక్ష విధించారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. Also Read: నిందితులను గురువారం తమ కస్టడీకి తీసుకున్న పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం వారిని దిశను దహనం చేసిన స్థలానికి తీసుకెళ్లారు. అక్కడ నిందితులను పోలీసుల నుంచి ఆయుధాలు లాక్కుని పారిపోయేందుకు ప్రయత్నించగా నలుగురిని తుపాకీలతో కాల్చి చంపారు. Also Read: సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో నిందితులు తమ వద్ద ఆయుధాలు లాక్కుని దాడి చేసేందుకు యత్నించినట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో తమ ప్రాణ రక్షణ కోసమే వారిని కాల్చి చంపినట్లు వెల్లడించారు. లొంగిపోవాలని హెచ్చరించినా నిందితులను పట్టించుకోకుండా పారిపోవడంతోనే వారిని ఎన్‌కౌంటర్ చేయాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. Also Read:


By December 06, 2019 at 09:36AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/telangana-police-responds-to-disha-accused-encounter-incident/articleshow/72393984.cms

No comments