Breaking News

బొమ్మలు కొనిస్తానంటూ 9 నెలల పసిపాపను మేనమామ తీసుకెళ్లి..!


‘దిశ’ నిందితులను ఎన్‌కౌంటర్ చేయగానే దేశం మొత్తం సంబరాలు చేసుకుంది. ఇక అమ్మా యిల మాన, ప్రాణాల జోలికి ఎవరూ రానని కొందరు ఆశించారు.. స్వీట్లు పంచుకున్నారు! కానీ, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై ఎన్‌కౌంటర్లు తాత్కాలిక ఉపశమనానికే గాని, శాశ్వత పరిష్కారం కాదనేలా పలు దిగ్భ్రాంతికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆడబిడ్డకు రక్తసంబంధీకుల నుంచి కూడా రక్షణ లేదా అని ఆలోచనలో పడేసేలా.. రాష్ర్టంలోని హౌరా జిల్లాలో 9 నెలల పసిపాపపై సొంత మేనమామే అత్యాచారానికి ఒడిగట్టాడు. Also Read: శ్యాంపూర్‌ పరిధిలోని బార్గావ్‌ ప్రాంతంలో ఓ కుటుంబం జీవనం సాగిస్తోంది. వారికి తొమ్మిది నెలల కుమార్తె సంతానం. అయితే ఇంటి పక్కనే ఉంటున్న మేనమామ పాపకు బొమ్మలు కొనిస్తానని మాయమాటలు చెప్పి బయటకు తీసుకెళ్లాడు. తిరిగి చిన్నారిని తల్లిదండ్రులకు అప్పజెప్పాడు. అయితే చిన్నారి మర్మాంగం నుంచి రక్తస్రావం అవుతుండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు అనుమానంతో సమీపంలోని పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు చిన్నారి మేనమామ అనుప్‌ ప్రమానిక్‌గా నిర్ధారించారు. నిందితుడిపై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (పోక్సో) కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. Also Read:


By December 07, 2019 at 11:22AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/9-months-baby-molestation-by-uncle-in-west-bengal/articleshow/72411049.cms

No comments