Breaking News

ఢిల్లీలో సరి-బేసి విధానం.. సీఎం కేజ్రీవాల్ వాహనానికి నో ఎక్స్‌క్యూజ్!


ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. గాలి నాణ్యత సూచి (ఏక్యూఐ) 494గా నమోదు కాగా, మూడేళ్లలో ఇదే అత్యధికం. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఢిల్లీ విమానాశ్రయం పొగమంచు గుప్పిట్లో చిక్కుకుంది. దీంతో పలు విమనాలను దారిమళ్లించారు. జైపూర్‌, అమృత్‌సర్‌, లక్నో, ముంబైలకు 37 విమానాలను దారిమళ్లించగా, మరో 550 విమాన సర్వీసులూ సగటున గంట నుంచి మూడు గంటలు ఆలస్యంగా నడిచాయి. ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో మూడు రోజుల కిందట హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించగా, నవంబరు 5 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. కాగా, వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని కొంతమేర తగ్గించాడనికి సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఆటోవాలాలు, ట్యాక్సీలు ప్రయాణీకుల నుంచి అధిక ఛార్జీలు వసూలుచేయవద్దని కోరారు. డెంగ్యూను నిరోధించినట్టుగా ఢిల్లీలో కాలుష్యాన్ని కూడా నివారిస్తామని కేజ్రీవాల్ అన్నారు. కాలుష్యంపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తన ఇంటి నుంచి కార్యాలయానికి సైకిల్‌పై వచ్చారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మంత్రులు సత్యేంద్ర జైన్, గోపాల్ రాయ్‌లు ఒకే వాహనంలో తమ కార్యాలయానికి చేరుకున్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి,గవర్నర్లు, ఛీఫ్ జస్టిస్,లోక్ సభ స్పీకర్, కేంద్ర మంత్రులు, రాష్టాల సీఎంలు, లోక్ సభ ,రాజ్యసభ ప్రతిపక్ష నాయకులకు సరి-బేసి విధానం నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే, దీని నుంచి ఢిల్లీ సీఎం వాహనానికి మినహాయింపు లేదు. దివ్యాంగులు, పాఠశాలలకు పిల్లలను తీసుకువెళ్లే వాహనాలు, ఎలక్ట్రిక్ వాహనాలకు మినహాయింపునిచ్చారు. సీఎన్‌జీ వాహనాలకు ఢిల్లీ ప్రభుత్వం మినహాయింపు ఇవ్వలేదు. సొంతగా వాహనాలు నడిపే మహిళలకు సరి-బేసి విధానం నుంచి మినహాయింపు కల్పించారు. మరోవైపు, వాయు కాలుష్యం నియంత్రణకు ఉత్తరప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి తాజ్‌మహల్‌ పశ్చిమ గేటు వద్ద ఎయిర్‌ ప్యూరిఫయర్‌ వ్యాన్‌ను అందుబాటులో ఉంచింది. కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు కేంద్ర కేబినెట్‌ సెక్రెటరీ రాజీవ్‌ గబ్బా.. ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌ ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతూ, రోజువారీ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇక దేశ రాజధాని ప్రజలు ఊపిరి సలుపుకోలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారంటూ పర్యావరణ పరిరక్షణ సంఘాలు ప్రధాని మోదీకి ఓ లేఖ రాశాయి. కాగా, ఢిల్లీ వాయు కాలుష్యంపై నటి ప్రియాంక చోప్రా ఇన్‌స్టా గ్రామ్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో కాలుష్యం వల్ల షూటింగ్‌లో పాల్గొనడం చాలా కష్టంగా ఉందని ప్రియాంక అన్నారు. ఈ కాలుష్యంలో ప్రజలు ఎలా ఉంటున్నారో తలచుకుంటుంటేనే చాలా భయంగా ఉందని అన్నారు. కాలుష్యం నుంచి కాపాడుకోవడానికి మనకి మాస్క్‌లు ఉన్నాయి కానీ ఇల్లు లేని చాలా మంది ప్రజలు రోడ్లు మీద నివసిస్తూ ఈ కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నారు.. అలాంటి వారి కోసం ప్రార్థించండి’ అని ప్రియాంక పేర్కొన్నారు.


By November 04, 2019 at 12:50PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/air-quality-touched-max-mark-in-delhi-odd-even-scheme-has-implementation-from-8am-today/articleshow/71888076.cms

No comments