Breaking News

కన్నకూతురిపైనే లైంగిక దాడి.. హైదరాబాదీకి పదేళ్ల జైలు


వావి వరుసలు మరిచి కన్న కూతురిపైనే అనేక సార్లు అత్యాచారానికి పాల్పడిన కామాంధుడికి సైబరాబాద్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ న్యాయమూర్తి నందికొండ నర్సింగ్‌రావు పదేళ్ల జైలుశిక్ష, రూ.5వేల జరిమానా విధించారు. మేడ్చల్‌ జిల్లా అల్వాల్‌ మండలం బొల్లారానికి చెందిన వ్యక్తి తాగుడుకు బానిసయ్యాడు. అతడి వేధింపులు భరించలేక భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఇంట్లో ఉండే కుమార్తెను బెదిరించి అనేకసార్లు తన లైంగిక కోరికలు తీర్చుకున్నాడు. 2018 ఆగస్టు 28న తన క్లాస్‌ టీచర్‌కు తండ్రి చేసుకున్న అఘాయిత్యం గురించి బాలిక చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. Also Read: దీంతో స్కూల్ ప్రిన్సిపాల్ ఆల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో అభియోగపత్రాన్ని దాఖలు చేశారు. అతడిని దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం పదేళ్ల జైలుశిక్ష, రూ.5వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో ఏడాది జైలుశిక్ష అనుభవించాలని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే తుది వాదనల సందర్భంగా నిందితుడు శిక్ష తగ్గించాలని కోర్టును కోరాడు. తనకు వృద్ధురాలైన తల్లి ఉందని, ఆమెను చూసుకునేందుకైనా శిక్ష తగ్గించాలని కోరాడు. Also Read: అయితే ఇలాంటి తీవ్ర నేరాల్లో కఠిన శిక్షలు వేయాల్సిందేనని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. దీంతో న్యాయమూర్తి నిందితుడికి జైలుశిక్ష ఖరారు చేశారు. మరోవైపు బాధిత బాలికతో పాటు ఐదేళ్ల ఆమె చెల్లెలికి పరిహార నిధి నుంచి రూ.1.50 లక్షల వంతున జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందేలా న్యాయమూర్తి మంజూరు చేశారు. పరిహారాన్ని బాధితుల బ్యాంకు ఖాతాలో జమచేసి వారి చదువు, ఇతర అవసరాల కోసం వినియోగించాలని ఆదేశించారు. Also Read:


By November 20, 2019 at 10:18AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hyderabad-man-gets-10-yr-prison-over-raped-minor-daughter/articleshow/72136717.cms

No comments