Breaking News

మహిళను చెట్టుకు కట్టేసి ఆరుగురి గ్యాంగ్‌ రేప్.. వైరల్‌గా మారిన వీడియో


ఉత్తర్‌ప్రదేశ్‌లో మహిళలపై నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా చిత్రకూట్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మహిళ తన కుటుంబసభ్యుడితో కలిసి సోమవారం(అక్టోబర్ 28) బంధువుల ఇంటికి వెళ్తోంది. వారిని మార్గమధ్యలో ఆరుగురు వ్యక్తులు అడ్డగించి వ్యక్తిని చితకబాదారు. ఆ తర్వాత మహిళను ఎత్తుకెళ్లి చెట్టుకు కట్టేసి వివస్త్రను చేశారు. అనంతరం ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ తతంగాన్నంతా సెల్‌ఫోన్లో వీడియో తీశారు. Also Read: ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే రేప్ వీడియోను ఇంటర్నెట్లో పెడతామని నిందితులు బెదిరించడంతో ఆమె సైలెంట్‌గా ఉండిపోయింది. అయితే శుక్రవారం ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కామాంధులు సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. దీంతో బాధితురాలు శుక్రవారం మౌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన బాధితురాలి బంధువును కూడా ప్రశ్నించిన పోలీసులు ఆరుగురు నిందితులపై కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సోషల్‌మీడియాలో పోస్టు్ చేసిన వీడియో డిలీట్ చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామరి చిత్రకూట్ జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. Also Read: Also Read:


By November 03, 2019 at 01:18PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/up-chitrakoot-woman-gang-raped-by-six-men-police-registered-video-surfaced-on-internet/articleshow/71875676.cms

No comments