యువతిని అపహరించి రేప్ చేసిన రవిశేఖర్కు రాచకొండ పోలీసుల షాక్

ఉద్యోగం పేరుతో యువతిని నమ్మించి కిడ్నాప్ చేసి పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన అంతర్రాష్ట్ర నేరస్థుడిపై మంగళవారం పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణాజిల్లా కంకిపాడు మండలం హరిజనవాడకు చెందిన అయితం రవిశేఖర్(48) చిన్నప్పటి నుంచి నేరాలకు అలవాటు పడ్డాడు. సీబీఐ, విజిలెన్స్ అధికారినంటూ పలువురిని మోసగించాడు. ఉద్యోగాల పేరుతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడ్డాడు. Also Read: గతంలో ఏపీ పోలీసులు అతడిని రెండుసార్లు అరెస్ట్ చేసి జైలుకు పంపినా అతడిలో మార్పు రాలేదు. ఈ ఏడాది ఆగస్టులో రంగారెడ్డి జిల్లా హయత్నగర్ పరిధిలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ యువతిని కారులో ఎక్కించుకున్న రవిశేఖర్ ఆమెకు అనేక ప్రాంతాలు తిప్పుతూ అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసుల గాలింపు ఎక్కువ కావడంతో భయపడి ఆమెను అద్దంకిలో వదిలేశాడు. బాధితురాలు అక్కడి నుంచి బస్సులో ఎంజీబీఎస్ చేరుకోవడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. Also Read: రవిశేఖర్ కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు అతడిని పట్టుకుని చర్లపల్లి జైలుకు తరలించారు. నిందితుడు గతంలోనూ ఇలాగే జైలుకెళ్లి తిరిగొచ్చి మోసాలకు పాల్పడిన చరిత్ర ఉండటంతో రాచకొండ పోలీసులు జాగ్రత్త పడ్డారు. అతడికి బెయిల్ రాకుండా చేసేందుకు పీడీ యాక్ట్ ప్రయోగించి అతడికి షాకిచ్చారు. Also Read:
By November 06, 2019 at 10:25AM
No comments