Breaking News

అక్కాచెల్లెళ్లపై ముగ్గురి గ్యాంగ్ రేప్.. మధ్యప్రదేశ్‌లో దారుణం


ఇంట్లో ఒంటరిగా ఉన్న అక్కాచెల్లెళ్లపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది. రేవా పట్టణంలోని ఘర్19 పోలీస్‌స్టేషన్ పరిధిలో నివసిస్తున్న దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. ఈ నెల 19వ తేదీన వారు ఓ పని నిమిత్తం బయటకు వెళ్లగా.. ఇద్దరు బాలికలు ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. Also Read: ఈ విషయాన్ని పసిగట్టిన స్థానిక యువకులు ముగ్గురు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంట్లోకి దొంగతనంగా ప్రవేశించారు. ఇద్దరు యువకుడు చెల్లిని పట్టుకోగా.. మూడో వ్యక్తి అక్కను గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం ముగ్గురూ కలిసి చెల్లిని నగ్నంగా చేసి లైంగికంగా వేధించారు. తమను వదిలిపెట్టాలని అక్కాచెల్లెళ్లు ఎంత బతిమాలిని ఆ కామాంధులు వినిపించుకోలేదు. Also Read: కొద్దిసేపటికి ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు ఇద్దరూ బాలికలు తమపై జరిగిన అఘాయిత్యం గురించి చెప్పి బోరుమన్నారు. దీంతో వారు గురువారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా.. మరో యువకుడు పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. Also Read:


By November 24, 2019 at 09:39AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/3-men-gangrape-two-sisters-were-alone-in-the-house-in-madhya-pradesh/articleshow/72205577.cms

No comments