Breaking News

20ఏళ్ల క్రితం ప్రేమపెళ్లి.. భర్తకు విడాకులివ్వకుండానే రెండో పెళ్లి


ఓ వ్యక్తిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న మహిళ 17ఏళ్ల తర్వాత మరో వ్యక్తి ప్రేమలో పడింది. కట్టుకున్న వాడు, ఇద్దరు పిల్లలు తనకొద్దంటూ కోర్టుకెక్కింది. విడాకులు రాకుండానే ప్రియుడిని పెళ్లాడింది. ఈ ఘటనపై ఆమె మొదటి భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మహిళ, ఆమె రెండో భర్తపై కేసు నమోదైంది. Also Read: హైదరాబాద్ శ్రీకృష్ణానగర్‌ ప్రాంతానికి చెందిన అశోక్‌(42) 1999, మే నెలలో ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ప్రస్తుతం ఓ కుమారుడు(18), కుమార్తె(15) ఉన్నారు. ఆమెకు 2016లో ఖమ్మం జిల్లాకు చెందిన వేణుగోపాల్ అనే వ్యక్తితో పరిచయమై ప్రేమకు దారితీసింది. ఈ విషయం అశోక్‌కు తెలియడంతో దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో ఆమె విడాకులకు దరఖాస్తు చేసుకుంది. Also Read: ఈ వ్యవహారం కోర్టులో కొనసాగుతుండగానే ఆమె 2017లో వేణుగోపాల్‌ను పెళ్లి చేసుకుని ఖమ్మంలో కాపురం పెట్టింది. దీంతో అశోక్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించాడు. విడాకులు రాకుండానే ఆమె రెండో పెళ్లి చేసుకోవడం చట్టవిరుద్ధమని, వారిద్దరూ భార్యభర్తలమని చూపి హౌస్ లోన్ కూడా తీసుకున్నారని అశోక్ ఆధారాలను కోర్టులో సమర్పించాడు. వాటిని పరిశీలించిన న్యాయస్థానం మహిళతో వేణుగోపాల్‌పై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు వారిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By November 18, 2019 at 09:22AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/banjarahills-police-filed-case-against-woman-and-his-second-husband/articleshow/72102714.cms

No comments