యూపీలో ఘోరం.. 16ఏళ్ల బాలికను రేప్ చేసి నిప్పంటించిన కామాంధుడు
ఉత్తర్ప్రదేశ్లో ఘోర ఘటన వెలుగుచూసింది. సంభాల్ జిల్లాలోని కన్నౌజ్ ప్రాంతంలో 16ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు ఆమెను సజీవ దహనం చేసేందుకు యత్నించాడు. 70శాతం శరీరం కాలిపోయిన ఆమెను స్థానికులు ఢిల్లీలోని ఓ ఆస్పత్రికి తరలించారు. Also Read: గురువారం రాత్రి సమయంలో బాలిక తల్లి, సోదరుడు ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లడంతో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన జీషన్ అనే యువకుడు ఇంట్లోకి చొరబడ్డాడు. తన కోరిక తీర్చకపోతే చంపేస్తానని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే తాను జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న ఆక్రోశంతో ఆమెపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టాడు. బాధితురాలి కేకలు విన్న స్థానికులు వెంటనే వచ్చి మంటలు ఆర్పివేసి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. Also Read: నఖాసా పోలీసులు నిందితుడు జీషన్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అతడిపై ఐపీసీ సెక్షన్ 376 (), సెక్షన్ 307 (హత్యాయత్నం), సెక్షన్ 452 (అతిక్రమణ), సెక్షన్ 506 (క్రిమినల్ బెదిరింపు) కింద భారత శిక్షాస్మృతి (ఐపిసి) కింద కేసు నమోదు చేశారు. Also Read:
By November 24, 2019 at 11:16AM
No comments