Breaking News

రఫీ సైకోనే కాదు అంతకుమించి.. 11 ఏళ్లకే బాలికపై అఘాయిత్యం, అతడి నేరాలకు అంతే లేదు


జిల్లా కురబలకోటలో చిన్నారి వర్షిత(6)ను దారుణంగా రేప్ చేసి చంపేసిన కేసులో నిందితుడు పఠాన్‌ మహమ్మద్‌ రఫీ అలియాస్‌ రఫీ అలియాస్‌ గిడ్డు(25) గురించి అనేక కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. అతనిది ఆది నుంచీ నేరస్వభావమే. అన్నింటా విపరీత మనస్తత్వమే. ఆగడాలు, అకృత్యాలకు అంతు లేదు. చదువూ సంస్కారం అబ్బలేదు. కన్నవారి మాటలు ఏనాడు పట్టించుకోలేదు. భార్యాబిడ్డల బాగోగులు పట్టించుకోలేదు. వెరసి బాల్యం నుంచే జులాయిగా పెరిగాడు. ఆడవాళ్ల జీవితాలతో ఆడుకునే కీచకుడి మారి ఎన్నోసార్లు చావుదెబ్బలు తిన్నాడు. ఈ క్రమంలోనే కరుడుగట్టిన నేరగాడిగా మారాడు. అతడి గురించి పూర్తి వివరాలు బయటపడటంతో ఇంతటి క్రూరుడు సమాజంలో తిరుగుతున్నాడా? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. Also Read: రఫీ స్వస్థలం మదనపల్లె పట్టణంలోని బసినికొండ. పెళ్లయ్యాక కురబలకోట మండలం మొలకవారిపల్లెలోని అత్తగారింట్లో ఉంటూ లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. రఫీ పట్టణంలో ఓ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న రోజుల్లో ఐదేళ్ల బాలికపై అత్యాచారానికి యత్నించాడు. పాఠశాల యాజమాన్యం, బాలిక తల్లిదండ్రులు రఫీని అక్కడి టూ టౌన్‌ పోలీసులకు అప్పగించారు. మూణ్నెల్ల పాటు బాలనేరస్థుల జైలులో గడిపాడు. బెయిల్‌పై బయటకు వచ్చాక బడికి వెళ్లకుండా జులాయిగా తిరిగేవాడు. ఏదో బతుకుదెరువు ఉంటే బాగుపడతాడన్న ఉద్దేశంతో పట్టణానికి చెందిన ఓ వ్యక్తి తన లారీకి క్లీనర్‌గా నియమించుకున్నాడు. లారీపై వివిధ ప్రాంతాలకు తిరుగుతూ.. పలుచోట్ల మహిళలతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నాడు. పట్టణ శివార్లలోని డ్రైవర్స్‌ కాలనీలో కొన్ని రోజులు అద్దెకు ఉన్నప్పుడు ఓ మహిళను వేధించాడు. ఆమె బంధువులు మందలించడంతో అక్కడి నుంచి వచ్చేశాడు. తర్వాత పెళ్లి చేసుకుని భార్యను వేధించడంతో కొద్దిరోజులకే ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. Also Read: ఈ క్రమంలోనే నవంబర్ 8వ తేదీన అంగళ్లు-మదనపల్లె రోడ్డులోని కేఎన్‌ఆర్‌ కల్యాణమండపంలో జరిగిన బంధువుల ఇంట్లో పెళ్లికి బి.కొత్తకోట మండలానికి చెందిన సిద్ధారెడ్డి, భార్య ఉషారాణి దంపతులు తమ కూతురు వర్షితతో కలిసి హాజరయ్యారు. అదే పెళ్లికి వెళ్లిన రఫీ కళ్లు వర్షితపై పడ్డాయి. ఆమెకు ఐస్‌క్రీమ్ ఆశచూపి ఫంక్షన్ హాల్‌ వెనక్కి తీసుకెళ్లి చేసి చంపేశాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపడంతో చిత్తూరు ఎస్పీ సెంథిల్‌కుమార్‌, మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. Also Read: కల్యాణ మండపంలోని సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు. గుర్తుతెలియని వ్యక్తి ఆ చిన్నారిని చరవాణిలో చిత్రీకరించినట్లు గుర్తించారు. ఆ పుటేజీనే కేసులో కీలక ఆధారమైంది. నిందితుడి ముఖం సరిగ్గా కనిపించకపోయినా, పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం, నిపుణుల సలహాతో దర్యాప్తు సాగించారు. ఫంక్షన్ హాల్‌లో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరగడం, కేవలం భోజనం కోసమే వచ్చి, మధ్యలో ఐస్‌క్రీములు తీసుకెళుతుండగా స్థానికులు గుర్తించి అడ్డుకున్నారు. తమ డ్రైవర్లు మద్యం తాగేందుకు వాటిని తీసుకెళ్తున్నానని చెప్పడం.. ఆపై టీవీఎస్‌ ఎక్సెల్‌ వాహనంలో వెళ్లడాన్ని గుర్తించి పోలీసులకు విచారణలో చెప్పారు. Also Read: వీటిని బట్టి నిందితుడు స్థానికుడేనని పోలీసులు నిర్ధరించుకున్నారు. అతడి పేరు రఫీ అని, అతడు స్థానికంగా ఓ లారీ యజమాని వద్ద క్లీనర్‌గా పనిచేస్తున్నాడనే సమాచారం రావడంతో ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు. ముందుగా తనకేమీ తెలియదని బుకాయించిన రఫీ.. పోలీసు విచారణలో నేరం అంగీకరించాడు. ఆ పాపకు సెల్ఫీలు తీసి వాటిని చూపుతూ దగ్గరయ్యాడు. ఈలోపు ఆ పాప బాత్‌రూమ్‌కి వెళ్లగా వెనకాలే వెళ్లి అతి క్రూరంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కొనప్రాణంతో ఉన్న చిన్నారిని 50 అడుగుల పై నుంచి కిందికి పడేశాడు. బాలికపై అతడు ప్రవర్తించిన తీరుతో రఫీ సైకో మనస్తత్వం గలవాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అతడి జీవనశైలి గురించి బంధువులు, స్నేహితులు, గ్రామస్థులను విచారించగా అనేక నేరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మానవ మృగానికి ఉరిశిక్ష పడేలా అన్ని ఆధారాలు సేకరించి న్యాయస్థానంలో సమర్పిస్తామని ఎస్పీ సెంథిల్‌కుమార్‌ మీడియాతో చెప్పారు. Also Read:


By November 17, 2019 at 12:55PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/chittoor-girl-rape-and-murder-case-police-reveals-shocking-things-of-accused-rafi/articleshow/72093386.cms

No comments